శవరాజకీయాలకు జగన్ బ్రాoడ్ అంబాసిడర్

Veldandi Saikiran
అమరావతి : టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  కల్తీ సారా మరణాలపై శాసన మండలిలో ప్రభుత్వం చర్చకు రాకుండా పారిపోయిందన్నారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్.  శవరాజకీయాలకు జగన్ బ్రాoడ్ అంబాసిడర్ అని అగ్రహించారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్.  తండ్రి శవం దొరక్కముందే సీఎం సీటు కోసం సంతకాలు సేకరణ చేపట్టిన వ్యక్తి జగన్ అన్నారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. మనకు తెలిసి చనిపోయింది 25 మందే,  తెలియకుండా రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన వారి సంఖ్య తేలాలన్నారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్.  మరణాలపై చర్చ చేపట్టకుండా ప్రభుత్వం ఇచ్చే ప్రకటన విని వెళ్లిపోవాలంటే ఎలా..?అని నిలదీశారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మద్యం దుకాణాల కాలపరిమితిని పెంచి మరీ మద్యం విక్రయాలు జరిపిస్తున్నారు... అధిక ధరలకు సర్కారీ మద్యం కొనలేక కల్తీసారా తాగి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. 


 ఇది ఇలా ఉండగా దేశంలోనే అత్యధిక కేటాయింపు ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వటం జరిగిందని..  మొత్తం 17 లక్షల 4 వేల 366 గృహాలు నిర్మాణం జరుగగా, వాటిలో ఇప్పటివరకు నాలుగు లక్షల ఎనభై ఆరు వేల ఐదు గృహాలను పూర్తిచేయటం జరిగిందని టిడిపి నేతలు పేర్కొన్నారు.  వీటి నిర్మాణం నిమిత్తం ఇప్పటివరకు కేంద్రం 31వేల 88 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వము కేటాయించగా వాటిలో  ఇప్పుడు వరకు 11,755 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందజేయడం జరిగిందని కేంద్రమంత్రి తెలియజేశారన్నారు.  జిల్లాల వారీ గా కేంద్రం చే  TIDCO గృహాల కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి. నెల్లూరు జిల్లాకు  41.696గుంటూరు జిల్లాకు 32,304 విశాఖ జిల్లా కు  30,786 కర్నూలు జిల్లాకు 30.672 కృష్ణా జిల్లాకు  27,872 పశ్చిమ గోదావరి జిల్లా కు 25,488 తూర్పు గోదావరి జిల్లాకు 23,400  గృహా కేటాయింపులు తో పాటు ఇతర జిల్లాలకు కూడా గృహ కేటాయింపులు జరిగాయని చెప్పారు.  ఈ గృహల్లో  చాలా వాటిని రాష్ట్ర ప్రభుత్వం “కోవిడ్” ఐసోలేషన్ సెంటర్లు గా వాడటం వలన లబ్దిదారులకు గృహాల అందచేత  ఆలస్యమైందనన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: