అమరావతి : పార్టీల్లో మార్చి 14 టెన్షన్ పెరిగిపోతోందా ?
నిజానికి జనేసేన ఒంటిరిగా పోటీచేస్తేనే దాని సత్తా ఏమిటో తేలుతుంది. అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డిని అధికారంలో నుండి దింపాలనే పవన్ కల నెరవేరదు. అందుకనే టీడీపీతో పొత్తు పెట్టకునే అవకాశాలపై ప్రచారం పెరిగిపోతోంది. టీడీపీ-జనసేన పొత్తంటే చూడటానికి బలంగానే కనబడుతుంది. కానీ క్షేత్రస్ధాయిలో, ఓట్ల బదలాయింపులో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చెప్పలేం. ఎందుకంటే చంద్రబాబును సీఎం చేయటానికి తామెందుకు కష్టపడాలని జనసేన+కాపు నేతలు అడుగుతున్నారు. పవన్ను సీఎం అభ్యర్ధిగా ప్రకటించేట్లయితే టీడీపీతో పొత్తుకు అభ్యంతరం లేదని కాపు నేతలంటున్నారు. ఇది జరిగేపనికాదని వాళ్ళకూ తెలుసు.
ఈ నేపధ్యంలో ఈనెల 14వ తేదీన పవన్ చేయబోయే ప్రకటనపై వైసీపీ, టీడీపీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఇప్పటికే చంద్రబాబు పంపిన లవ్ ప్రజోజల్ గురించి అందరికీ తెలిసిందే. లవ్ ప్రపోజల్ ను పవన్ అంగీకరిస్తే టీడీపీలో జోష్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. తిరస్కరిస్తే వైసీపీ హ్యాపీ, బీజేపీ నేతలు ఊపిరి పీల్చుకుంటారు. పవన్ నిర్ణయంలో ఇన్ని ట్విస్టులున్నాయి కాబట్టే పార్టీల్లో మార్చి 14 టెన్షన్ పెరిగిపోతోంది.