విశాఖ ‘ఫ్యాన్స్’కు జగన్ బంపర్ ఆఫర్?
కానీ ఇంతవరకు అధికారికంగా మంత్రివర్గంలో మార్పులు గురించి ప్రకటన రాలేదు...కాకపోతే పూర్తి క్యాబినెట్ మార్చి..కొత్తవారిని క్యాబినెట్లోకి తీసుకుంటారనే ప్రచారం ఉంది..అలాగే సగం అని ఒకసారి...కాదు 80 శాతం మార్పు జరగొచ్చని మరొకసారి ప్రచారం జరుగుతూ వచ్చింది...సరే జగన్ ఎంతమందిని మంత్రి వర్గం నుంచి తొలగించి..ఎంతమందిని తీసుకుంటారో క్లారిటీ లేదు.
సరే అది క్లారిటీ లేకపోయినా...ఖచ్చితంగా మంత్రివర్గంలో మార్పులు మాత్రం జరుగుతాయనేది తెలుస్తోంది..అందుకే చాలామంది ఎమ్మెల్యేలు పదవిపై ఆశ పెట్టుకున్నారు..అలా అని చెప్పి ఆశ పెట్టుకున్న ప్రతి ఒక్కరికీ పదవి దక్కడం కష్టం...కానీ విశాఖలో ఖచ్చితంగా ఇద్దరికి లేదా ముగ్గురుకు క్యాబినెట్లో చోటు దక్కవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం విశాఖలో ఒక మంత్రి మాత్రమే ఉన్నారు..అవంతి శ్రీనివాస్ టూరిజం మినిస్టర్గా ఉన్నారు..అసలు విశాఖలో ఎంతోమంది సీనియర్లు ఉండగా, ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చి భీమిలిలో గెలిచిన అవంతికి అనూహ్యంగా మంత్రి పదవి దక్కింది.
అయితే మంత్రిగా అవంతి ఏమి గొప్ప పనితీరు కనబర్చడం లేదు..కాబట్టి ఈయన్ని నెక్స్ట్ ఖచ్చితంగా సైడ్ చేస్తారని తెలుస్తోంది..అదే సమయంలో ఈ సారి విశాఖ నుంచి కనీసం ఇద్దరిని క్యాబినెట్లో తీసుకోవచ్చని సమాచారం. ఇక మంత్రి పదవి సాధించడానికి అనేక మంది నేతలు పోటీ పడుతున్నారు...గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, బూడి ముత్యాలనాయుడు, కన్నబాబు రాజు, ఇంకా పలువురు ఎమ్మెల్యేలు మంత్రి పదవి ఆశించే లిస్ట్లో ఉన్నారు. చూడాలి మరి ఈ సారి విశాఖలో మంత్రి అయ్యే బంపర్ ఆఫర్ ఎవరు కొట్టేస్తారో.