సమ్మక్క సారక్క హుండీ ఆదాయం.. ఎన్ని కోట్లో తెలుసా?
జాతర నేపథ్యంలో ఇసుక వేసిన రాలనంత మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు. ఇక తండోపతండాలుగా మేడారం చేరుకుని ఇక సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. ఇకపోతే ఇటీవలే హుండీ లెక్కింపు ప్రారంభించారు. బుధవారం ఈ హుండీ లెక్కింపు ప్రారంభం కాగా ఇటీవలే ముగిసినట్లు తెలుస్తోంది. హనుమకొండలోని కళ్యాణమండపంలో సమ్మక్క సారలమ్మ జాతర హుండీలను తెరిచి లెక్కించారు అధికారులు. పటిష్టమైన నిఘా మధ్య ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. అయితే గత ఏడాదితో పోల్చి చూస్తే ఈసారి సమ్మక్క సారలమ్మ హుండీ ఆదాయం భారీగానే వచ్చినట్లు తెలుస్తోంది.
మొతంగా 497 హుండీలలో ఇప్పుడు వరకు 65 హుండీలను తెరిచి లెక్కించారు అధికారులు. ఇక ఇప్పటి వరకు ఒక కోటి 34 లక్షల 60 వేల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇక ఈ ఆదాయం మొత్తాన్ని అధికారులు బ్యాంకులో జమ చేయడం గమనార్హం. ఇకపోతే మాఘ పౌర్ణమి సందర్భంగా బుధవారం నుంచి శనివారం వరకు నాలుగు రోజులపాటు కూడా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే ఇక మేడారం జాతరకు ఈ ఏడాది అత్యధికంగా కోటి మందికి పైగా భక్తులు తరలివచ్చారు అన్న విషయాన్ని ఇటీవలే అధికారులు స్పష్టం చేశారు.