2రూ.లకే దోశ.. 3 రూ. లకే ఇడ్లీ.. ఎక్కడంటే?
ఇక ఇలా తక్కువ ధరకే దోశ ఇడ్లీ అమ్ముతున్న చిన్న తంబీ వ్యాపారం తక్కువ సమయంలోనే అందరికీ తెలిసిపోయింది. దీంతో ఎంతో రుచికరమైన టిఫిన్ తినడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు అందరూ. ప్రతిరోజు 600 నుంచి 800 వరకు దోషులను అమ్ముతున్నాడట చిన్న తంబి. రాత్రివేళ ఇడ్లీ పరోటా తో పాటు హమ్లెట్ ను కూడా అందిస్తారట. కాగా తమిళనాడులోని ఒరైయుర్ పోలీస్ స్టేషన్ సమీపంలో చిన్న వీధి లో చిన్న తంబి కి చిన్న హోటల్ ఉంది. ఆరు సంవత్సరాల నుంచి రెండు రూపాయలకే దోష మూడు రూపాయలకు ఇడ్లీ అమ్ముతాడు ఇక ప్రతి రోజూ వందలాది మంది కస్టమర్లు అక్కడికి వస్తారట.
అయితే కొన్నాళ్లపాటు హోటల్లో పని చేసిన చిన్న తంబీ తానే స్వయంగా హోటల్ ప్రారంభించాలి అని అనుకున్నాడు. అయితే పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ధరలు ఉండాలి అని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే దోష రెండు రూపాయలు ఇడ్లీ మూడు రూపాయలు క్యారెట్ ఉల్లిపాయలతో చేసే ఊతప్పం 4 రూపాయలకే అమ్ముతూ ఉంటాడు. మృతులు పది రూపాయల నోటు తో వచ్చి కడుపు నింపుకోవాలి అనే ఉద్దేశంతోనే హోటల్ ప్రారంభించి తక్కువ ధరలు పెట్టాను అంటూ చెబుతున్నాడు చిన్న తంబి..