శ్రీరామ్ ఆన్ ఫీల్డ్..సీటు నిలబెట్టుకుంటారా?

M N Amaleswara rao
తెలుగుదేశం పార్టీలో పరిటాల శ్రీరామ్ దూకుడు పెంచారు...గత ఏడాది నుంచి శ్రీరామ్ దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు..గత ఎన్నికల్లో ఓడిపోయాక కొన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న శ్రీరామ్...ఎప్పుడైతే ధర్మవరం బాధ్యతలు కూడా దక్కాయో అప్పటినుంచి గేర్ మార్చారు..ఫ్యామిలీకి రెండు సీట్లు దక్కుతుండటంతో ఇంకా ఏ మాత్రం తగ్గకుండా పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఎలాగో రాప్తాడు సీటు పరిటాల ఫ్యామిలీ కిందే ఉంది...అలాగే ధర్మవరం బాధ్యతలు కూడా శ్రీరామ్ చూసుకుంటున్నారు. దీంతో రాప్తాడులో సునీతమ్మ, ధర్మవరంలో శ్రీరామ్ పోటీ చేయడం ఫిక్స్ అయిపోయిందని పరిటాల అనుచరులు ప్రచారం చేస్తున్నారు.
అందుకు తగ్గట్టే శ్రీరామ్ కూడా పనిచేస్తున్నారు...అయితే ఇటీవల ధర్మవరం సీటు విషయంలో ఒక ట్విస్ట్ వచ్చిన విషయం తెలిసిందే. బీజేపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణ టీడీపీలోకి వచ్చి ధర్మవరం సీటు తీసుకుంటారని ఆయన అనుచరులు బహిరంగంగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఎందుకంటే గతంలో సూరి టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు..పైగా గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయి, బీజేపీలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఆయన టీడీపీలోకి రావడానికి చూస్తున్నారని తెలుస్తోంది...అలాగే ధర్మవరం సీటు తీసుకోవాలని చూస్తున్నారు.
కానీ పార్టీలోకి ఎవరు వచ్చిన ధర్మవరం సీటు మాత్రం తనదే అని శ్రీరామ్ అంటున్నారు...సూరి అనుచరుల వ్యాఖ్యల తర్వాత మరింత ఎక్కువగా శ్రీరామ్ ధర్మవరంలో పనిచేస్తున్నారు. తాజాగా ధర్మవరం రెవెన్యూ డివిజన్‌ని పునరుద్ధరించాలని చెప్పి దీక్ష కూడా చేశారు. ఇటీవల జిల్లాల విభజనలో భాగంగా ధర్మవరం రెవెన్యూ డివిజన్‌ని రద్దు చేసి పుట్టపర్తి రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై ధర్మవరం ప్రజలు ఫైర్ అవుతున్నారు..ఇక ఈ అంశంపై శ్రీరామ్ పోరాటం చేస్తున్నారు. ధర్మవరం రెవెన్యూ డివిజన్ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. అటు సూరి సైతం దీనిపై పోరాడుతున్నారు...దీంతో శ్రీరామ్ ఏకంగా నిరాహార దీక్షకు దిగారు. అంటే ధర్మవరం సీటు కూడా దక్కించుకోవాలనే ఉద్దేశంతో శ్రీరామ్ దూకుడు పెంచారని అర్ధమవుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: