రైతుబంధు కట్..ఎందుకో తెలుసా..!

MOHAN BABU
గ్రామాల్లో గంజాయి సాగవుతున్న సమాచారాన్ని అధికార యంత్రాంగానికి అందించకపోతే ఊరికి రైతుబంధు, ఇతర సబ్సిడీలు రద్దు చేస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. చట్ట వ్యతిరేక చర్యల పై గ్రామస్తులంతా అప్రమత్తమై సర్కారుకు ముందస్తు సమాచారం అందించే దిశగా చర్యలు చేపట్టాలని సీఎస్ ను ఆయన ఆదేశించారు. డ్రగ్స్ పై శుక్రవారం ప్రగతిభవన్ లో అబ్కారి, పోలీస్ ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు. సినిమా, సోషల్ మీడియా తదితర ఆన్లైన్ ప్లాట్ ఫామ్స్ వల్ల కూడా డ్రగ్స్ వాడకం పెరిగిపోతుందని అధికారులు సీఎం కేసీఆర్ కు వివరించారు. సీఎం మాట్లాడుతూ డ్రగ్స్ అరికట్టేందుకు ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలని సూచించారు.

మొదటి వ్యూహంలో డ్రగ్స్ కు అడిక్ట్ అయిన వారిని గుర్తించి డీ అడిక్ట్ చేసేందుకు ప్లాన్ రూపొందించాలన్నారు. డ్రగ్ నెట్వర్క్ లింక్ ను గుర్తించి నిర్వీర్యం చేయడం  అనేది రెండు ప్లాన్ గా చేపట్టాలని సూచించారు. డ్రగ్స్ మాఫియా ను గుర్తించి అరికట్టే క్రమంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం లేటెస్ట్ వెపెన్స్ ను ఉపయోగించాలని, మరికొన్ని ఫోరెన్సిక్ ల్యాబ్స్ ను అత్యంత అధునాతన టెక్నాలజీతో ఏర్పాటు చేయాలన్నారు. ఎక్స్పర్ట్ లు అయిన పోలీసులకు బాధ్యతలు అప్పగించి డ్రగ్స్ మాఫియా పై విజృంభించాలని  సీఎం ఆదేశించారు. స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అవలంబిస్తున్న విధానాలను పరిశీలించి, నిందితులను పట్టుకునే దిశగా పోలీసు అధికారుల బృందాన్ని తీర్చిదిద్దాలని సీఎం అన్నారు. పంజాబ్ లాంటి రాష్ట్రంలో డ్రగ్ కంట్రోల్ చేస్తున్న అధికారులను పిలిపించి ట్రైనింగ్ తీసుకోవాలన్నారు.ఎంత ఖర్చయినా పర్వాలేదని రాష్ట్రంలో డ్రగ్ కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తుందని చెప్పారు. వెయ్యి మంది సుశిక్షితులైన పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా నియమించాలని, అత్యాధునిక హంగులతో కౌంటర్ ఇంటలిజెన్స్ సెల్ ను ఏర్పాటు చేసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు.

 కోర్టులో డ్రగ్స్ కేసులు పెరిగిపోకుండా, నేరాలను రుజువు చేసేందుకు కావలసిన అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. డ్రగ్స్ నియంత్రణలో ఏ పార్టీకి చెందిన వారైనా, ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని హెచ్చరించారు. ప్రజా ప్రతినిధుల సిఫారసులను తిరస్కరించాలని స్పష్టం చేశారు. ప్రజలను చైతన్యం చేయడానికి మీడియా,సినిమా మాధ్యమాలను ఉపయోగించుకోవాలని,డ్రగ్స్ నియంత్రించే దిశగా నిర్మించే సినిమాలు,డాక్యుమెంటరీలు, అడ్వటైజ్మెంట్ లకు సబ్సిడీలు అందించాలని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: