పీటీ ఉషాపై కేసు... మోసం చేశారంటున్న అథ్లెట్..!

Podili Ravindranath
పరుగుల రాణి అంటే... భారత్‌లో అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది పీటీ ఉషా మాత్రమే. కేరళకు చెందిన ఈ పరుగుల రాణిపై ఇప్పుడు సొంత రాష్ట్రంలోనే చీటింగ్ కేసు నమోదైంది. ఓ ఫ్లాట్ విషయంలో పీటీ ఉషా తనను మోసం చేశారంటున్నారు మాజీ అథ్లెట్ జెమ్మా జోసెఫ్. పోలీసు స్టేషన్‌లో పీటీ ఉషపై ఫిర్యాదు చేశారు జోసఫ్. దీంతో ఆమెపై పోలీసులు ఐపీసీ 420 సెక్షన్ కింద ఛీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసుపై విచారణ ప్రారంభించినట్లు వెల్లయిల్ పోలీసులు ఇప్పటికే వెల్లడించారు. కోజికోడ్‌లో వెయ్యి 12 అడుగుల విస్తీర్ణంలో ప్లాట్‌ను ఓ ప్లాట్‌ను ఓ బిల్డర్ నుంచి మాజీ అథ్లెట్ జెమ్మా జోసఫ్ కొనుగోలు చేశారు. దీని కోసం ఇప్పటి వరకు మొత్తం 46 లక్షల రూపాయలు కూడా చెల్లించారు. అయితే ఆ ప్లాట్ మాత్రం ఇప్పటి వరకు బిల్డర్ జెమ్మా జోసఫ్‌కు అప్పగించలేదు. పీటీ ఉష మధ్యవర్తిత్వంతోనే ఆ డబ్బులు బిల్డర్‌కు చెల్లించినట్లు జెమ్మా జోసఫ్ తెలిపారు. డబ్బు చెల్లించిన తర్వాత కూడా తనకు ప్లాట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. కనీసం సమాధానం కూడా చెప్పడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు జెమ్మా జోసఫ్.
తన దగ్గర డబ్బులు తీసుకుని పీటీ ఉషా, బిల్డర్ ఇద్దరూ కలిసి మోసం చేశారని జెమ్మా జోసఫ్ ఆరోపించారు. అటు బిల్డర్ మోసంపై కూడా కేరళ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీకి సైతం ఈ మాజీ అథ్లెట్ ఫిర్యాదు చేశారు. ప్లాట్ అప్పగించేందు, డబ్బులు తిరిగి ఇచ్చే విషయంపై కూడా ఇద్దరు కనీసం ఒక్కమాట చెప్పటం లేదని ఆరోపించారు జోసఫ్. పిటీ ఉషాతో పాటు మరో ఆరుగురిపై కూడా పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేశారు. బిల్డర్ మోసం చేశాడనే మాజీ అథ్లెట్ ఫిర్యాదుపై కేరళ రియల్ ఎస్టేట్ రెగ్యులేరటీ అథారిటీ ఇచ్చే రిపోర్డు ఆధారంగా చర్యలు తీసుకుంటామని కూడా కోజికోడ్ పోలీసులు వెల్లడించారు. పీటీ ఉషా మాటలు నమ్మిన తర్వాతే బిల్డర్‌కు డబ్బులు ఇచ్చినట్లు జోసఫ్ ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పుడు కనీసం తనకు సంబంధం లేనట్లుగా పీటీ ఉషా వ్యవహరిస్తున్నారని... జోసఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలంటూ జోసఫ్ వేడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: