విజ‌య‌సాయి రెడ్డి పేల్చిన బాంబుతో వైజాగ్ వైసీపీ ఎమ్మెల్యేల విల‌విలా..!

VUYYURU SUBHASH
వైసిపి సీనియర్ నేత , ఆ పార్టీ ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇన్చార్జ్ ... రాజ్యసభ సభ్యుడు vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">విజయసాయి రెడ్డి తాజాగా పేల్చిన బాంబు వైజాగ్ వైసిపి ఎమ్మెల్యేల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వారు త‌మ బాధ ఎవ్వ‌రికి చెప్పుకోలేని పరిస్థితి ఉంది. తాజాగా విశాఖ నగర వైసీపీ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ ఎమ్మెల్సీ నామినేష‌న్ కార్యక్రమంలో vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ సాయి మాట్లాడుతూ ఎప్పుడో వంశీకృష్ణకు ప‌ద‌వి రావాల్సి ఉంద‌ని.. అయినా కాస్త ఆలస్యంగా అయినా ఎమ్మెల్సీ పదవి వచ్చిందని... భవిష్యత్తులో వంశీకి ఇంతకుమించిన పెద్ద ప‌ద‌వి రాబోతుందని జోస్యం చెప్పారు.

ఈ మాటే ఇప్పుడు విశాఖపట్నం జిల్లా వైసీపీ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోందట. గత సాధారణ ఎన్నికలకు ముందు వరకు విశాఖ తూర్పు వైసీపీ ఇన్చార్జిగా వంశీకృష్ణ శ్రీనివాస్ ఉన్నారు. అయితే ఆయన ఎన్నికలలో జగన్ సూచన మేరకు త‌న సీటు త్యాగం చేశారు. తర్వాత విశాఖ  మేయ‌ర్ ప‌ద‌వి వస్తుందని ఆశలు పెట్టుకున్నా రాలేదు. ఆయ‌న కార్పోరేట‌ర్ గా కూడా పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది.

త్వరలో జరిగే కేబినెట్ మార్పులు .. చేర్పుల్లో బిసి యాద‌వ కోటాలో ఆయనకు మంత్రి పదవి కూడా వస్తుందని అంటున్నారు. విజ‌యసాయి మాటల అర్థం కూడా అదే న‌ని పార్టీ నేత‌లు చ‌ర్చించు కుంటున్నారు. జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ ను తప్పిస్తే ఆ ప్లేస్ లో తాము మంత్రులం అవుతామని జిల్లా ఎమ్మెల్యే లు గుడివాడ అమర్నాథ్ - బూడి ముత్యాలనాయుడు - గొల్ల బాబురావు లాంటి నేతల ఆశలు పెట్టుకున్నారు.

అయితే ఇప్పుడు విజ‌య‌ సాయి వేసిన ఒకే ఒక్క డైలాగ్ వారందరూ గుండెలో రైలు పరిగెత్తించేలా చేస్తోందట. జిల్లా కోటాలో మంత్రి పదవి వస్తుంద‌న్న‌ తమ ఆశలపై సాయి రెడ్డి బాంబు నీళ్లు చల్లినట్టు చేసిందని వారు ఆవేదనతో ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: