లుచ్చా పనులు చేయలేదన్న కొడాలి, టీడీపీ రైతులు రియల్ ఎస్టేట్ వ్యాపారులన్న మరో మంత్రి...!

Gullapally Rajesh
ఆంధ్రప్రదేశ్ శాసన సభా సమావేశాల్లో వాతావరణం కాస్త వాడీ వేడిగా ఉందని చెప్పాలి. టీడీపీ నేతలకు అధికార పార్టీ సభలో గట్టిగా కౌంటర్ ఇవ్వడంతో చంద్రబాబు కూడా ఇబ్బంది పడ్డారు. రైతు సంక్షేమం, వ్యవసాయంపై అసెంబ్లీ లో హాట్ డిస్కషన్ జరిగింది నేడు. వ్యవసాయం విషయంలో పదే పదే చంద్రబాబు పేరు ప్రస్తావిస్తున్నారని టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ చంచల్ గూడ జైల్లో సమావేశాలు పెట్టుకునే పార్టీ వైసీపీ అంటూ టీడీపీ కామెంట్స్ చేసింది. టీడీపీ కామెంట్లపై వైసీపీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది సభలో. చంద్రబాబులా మేం లుచ్చా పనులు చేయడం లేదన్న మంత్రి కొడాలి నాని కొడాలి నానీ కామెంట్స్ తో దుమారం రేగింది.
వ్యవసాయంపై చర్చ తో పాటు బాబాయికి గొడ్డలి పోటు, తల్లికి ద్రోహం సహా అన్ని విషయాలపై చర్చకు సిద్దమేనని చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేసారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతోన్న సందర్భంలో అడ్డుతగిలిన అచ్చెన్నాయుడు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసారు. పార్టీ లేదు బొక్కా లేదన్న ఓ పార్టీ అధ్యక్షుడ్ని తొలిసారి చూస్తున్నామంటూ మంత్రి కన్నబాబు ఎద్దేవా చేసారు సభలో. కుప్పం మా లెక్కలోకే లేదన్న అచ్చెన్నాయుడు గురించి ఇంకేం మాట్లాడగలమంటూ కన్నబాబు సెటైర్లు విసిరారు టీడీపీ నేతలకు.
మంగళగిరిలో తనయుడు ఓటమిని తట్టుకున్న చంద్రబాబు కుప్పం ఓటమిని  తట్టుకోలేరా అంటూ కన్నబాబు వ్యంగ్యోక్తులు విసిరారు. జైలు లో మీటింగ్ పెట్టుకునే పార్టీ అంటూ గతం లో కన్నబాబు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన టీడీపీకి మంత్రి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. సభలో మంత్రి కన్నబాబు మాట్లాడుతూ మాకు రైతులు అంటే పంట‌లు పండించే వారు రైతులు అని అన్నారు. టీడీపీ వారికి రైతులు అంటే అమ‌రావ‌తి భూములు వ్యాపారం చేసే వారు రైతులు అని ఎంత‌దాచుకుందామ‌నుకున్నా టిడీపీ కి అమ‌రావ‌తి పై ప్రేమను దాచుకోలేరని ఎద్దేవా చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: