ఆ ఇద్దరు నేతలకు ఆ రెండు పదవులు ఫిక్స్ చేసేసిన జగన్..!
మండలిలో వైసీపీ బలమే ఉండనుంది. దీంతో ఇప్పుడు మండలి ఛైర్మన్, వైఎస్ ఛైర్మన్ లను ఎంపిక చేయాలి. దీంతో జగన్ ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఆసక్తిగా మారింది. జగన్ అన్ని పదవుల భర్తీలో క్యాస్ట్ ఈక్వేషన్లే ప్రధానంగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ పదవులు కూడా కేబినెట్ ర్యాంకు కావడంతో పార్టీలో ఆ శావాహులు ఈ పదవుల కోసం తమ స్థాయిలో అయితే లాబీయింగ్ చేస్తున్నారట.
అయితే జగన్ మాత్రం వీటికి తలొగ్గరు. మండలి చైర్మన్ గా ఎస్సీ సామాజికవర్గానికి చెందిన కొయ్యే మోషేన్ రాజును ఎంపిక చేసే అవకాశముందని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు. మండలి లో దళితులకు ప్రాధాన్యం ఇవ్వాలనే జగన్ ఈ నిర్ణయం తీసుకో బోతున్నారట. ఇక డిప్యూటీ చైర్మన్ మైనారిటీలకు ఇచ్చే అవకాశముంది. గత తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈ పదవిని మైనార్టీ లకే ఇవ్వడంతో ఇప్పుడు జగన్ సైతం ఈ పదవిని మైనార్టీ లకే ఇస్తే కుల సమీకరణలు మ్యాచ్ చేసినట్టు అవుతుందని జగన్ భావిస్తున్నారట.