ఇంత భారీ వర్షాలకు కారణం ఏమిటో తెలుసా?

VAMSI
కరోనా వచ్చి రెండేళ్లు పైనే అవుతోంది. ప్రస్తుతం పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ గతంలో ఈ మహమ్మారి సృష్టించిన భీబత్సం మాటల్లో చెప్పడానికి సాధ్యం కాదు. ఈ కరోనా చేసిన కాస్తో కూస్తో మంచి ఏమైనా ఉంది అంటే అది కాలుష్యాన్ని తగ్గించడమే. అవును ఇది నిజమే కరోనా వైరస్ ఉదృతి ఎక్కువగా ఉన్న సమయంలో ప్రపంచ దేశాలు లాక్ డౌన్ పేరిట తమని తాము నిర్బంధించుకున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ తర్వాత కూడా జనాలు చాలా రోజుల వరకు పెద్దగా బయటకు రాలేదు. దీని వలన వాహనాల వాడకం కొద్ది రోజుల పాటు గణనీయంగా తగ్గింది. తద్వారా వాతావరణంలో కాలుష్యం బాగా తగ్గి ఓజోన్ లేయర్ కి కూడా మంచి జరిగినట్లు చాలా వార్తలే వినిపించాయి.
ఈ పరిస్థితి వల్ల భూమి కాస్త ఊపిరి తీసుకుంది. ఢిల్లీ సహా 90 నగరాల్లో కొద్ది రోజుల పాటు కనీస స్థాయి కాలుష్యం కూడా నమోదు కాలేదని... దీంతో వాయు నాణ్యత ఎంతగానో మెరుగుపడిందని కొందరు వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. అయితే ఇంతగా కాలుష్యం తగ్గడంతోనే వాతావరణంలో మార్పులు జరిగి ప్రస్తుతం అధికంగా వర్షాలు పడుతున్నాయని కొందరి విశ్లేషకుల అభిప్రాయం. ఎన్నో వందల ఏళ్ల క్రితం ఇలా కాలాలకు సంబంధం లేకుండా వర్షాలు పడుతుండేవి. ఈ మధ్య ఇలాగే దేశంలో భారీ వర్షాలు నమోదు అయిన విషయం తెలిసిందే.
తగినంత వర్షాలు లేక అల్లాడుతున్న పర్యావరణానికి ఒక విధంగా లాక్ డౌన్ మంచి చేసిందని కొందరు అంటున్నారు. ప్రపంచ దేశాలలో కాలుష్యం తగ్గించి రానున్న తరాలకు స్వఛ్చమైన గాలిని, వాతావరణాన్ని అందించాలి అంటే కనీసం రెండు నెలలకు ఒకసారి అయినా లాక్ డౌన్ ను ప్రజలు ప్రభుత్వం పాటించేలా చేయాలి అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఆచరణలో సాధ్యపడకపోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: