వరప్రసాద్ గారు ఆ రిస్క్ తీసుకుంటారా ?
మెగా - విక్టరీ కాంబో:
మెగాస్టార్ చిరంజీవి మరియు విక్టరీ వెంకటేష్ కలిసి ఒక పాటలో కనిపించబోతున్నారనే వార్త ఇప్పటికే సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ పాటను ప్రమోషన్ల పీక్ స్టేజ్లో విడుదల చేసి హైప్ క్రియేట్ చేయాలని దర్శకుడు భావిస్తున్నారు.
ఇటీవల ‘అఖండ 2’ సినిమా ఒక రోజు ముందే ప్రీమియర్లకు వెళ్లి మిశ్రమ ఫలితాలను చూసింది. సినిమా కంటెంట్ బాగున్నప్పటికీ, అర్ధరాత్రి నుంచే సోషల్ మీడియాలో టాక్ బయటకు రావడం వల్ల సాధారణ ప్రేక్షకులపై అది ప్రభావం చూపింది. ప్రభాస్ ‘రాజా సాబ్’ కూడా ప్రీమియర్లకు వెళ్తుండటంతో, చిరంజీవి సినిమా కూడా అదే బాటలో నడిచే అవకాశం ఉంది.
ప్రీమియర్ల వల్ల పాజిటివ్ టాక్ వస్తే సినిమాకు అడ్వాంటేజ్ అవుతుంది, కానీ ఏమాత్రం తేడా వచ్చినా మొదటి రోజు వసూళ్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. మెగా ఫ్యాన్స్ ఇదే విషయంలో కొంత టెన్షన్ పడుతున్నారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పెషల్ షోలు, రేట్ల పెంపు ఉండదని స్పష్టం చేశారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా ‘రాజా సాబ్’ కు పెంపు ఇస్తే, ఆటోమేటిక్ గా చిరంజీవి సినిమాకు కూడా అవే నిబంధనలు వర్తిస్తాయి. ‘రాజా సాబ్’ - ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బడ్జెట్, బిజినెస్ పరంగా వ్యత్యాసం ఉన్నప్పటికీ, మరీ భారీగా రేట్లు పెంచితే సామాన్య ప్రేక్షకులు థియేటర్లకు దూరం అయ్యే ప్రమాదం ఉంది. బడ్జెట్కు తగ్గట్టుగా రేట్లు పెంచితేనే ప్రేక్షకులు ఆమోదిస్తారు. మరి ఈ విషయంలో శంకర వరప్రసాద్ ఎలాంటి రిస్క్ తీసుకుంటారు ? అన్నది చూడాలి.