ఏపీలో ఇక చిన్నారులకు కంటి ఆపరేషన్స్ ఫ్రీ...?
ఏపీలో కాంప్రహెన్సివ్ ఐ కేర్కు సంబంధించి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ముందుకొచ్చిన ఎల్ వి ప్రసాద్ ఐ ఇన్ట్సిట్యూట్, సీఎం వైఎస్ జగన్తో ప్రాధమికంగా చర్చలు జరిపిన మేనేజ్మెంట్ టీం... ఈ సందర్భంగా కీలక నిర్ణయం ప్రకటించింది. అంధ్రప్రదేశ్లో ఏ ఒక్కరూ కంటి సమస్యలు, వైద్యం కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్ళకుండా అంతర్జాతీయ స్ధాయిలో, అత్యాధునిక కంటి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రి బృందాన్ని సీఎం జగన్ కోరగా... ఎల్ వి ప్రసాద్ ఐ ఇన్ట్సిట్యూట్ టీం అంగీకరించింది.
కంటికి సంబంధించి, అంధత్వ నివారణకు స్క్రీనింగ్ నుంచి సర్జరీ వరకూ అన్ని స్ధాయిలలోనూ అత్యాధునిక వైద్యం అందించేందుకు తగిన ప్రణాళికలు సిద్దం చేయాలని ఆసుపత్రి యాజమాన్యానికి సీఎం జగన్ సూచించారు. ముందుకొచ్చిన ఎల్ వి ప్రసాద్ మేనేజ్మెంట్... రాష్ట్రంలో ఉన్న అన్ని అనాధ శరణాలయాలలోని చిన్నారులకు నేత్ర వైద్య పరీక్షలు, చికిత్సలు ఉచితంగా చేసేందుకు ముందుకు వచ్చింది. కంటి వైద్యానికి సంబంధించి దేశంలోనే ప్రముఖ ఆసుపత్రిగా ఎల్ వి ప్రసాద్ ఐ ఇన్ట్సిట్యూట్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ఎల్ వి ప్రసాద్ ఐ ఇన్ట్సిట్యూట్ చైర్మన్ డాక్టర్ ప్రశాంత్ గార్గ్, వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ రెడ్డి పప్పూరు, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.