టీఆర్ఎస్ @ 20 : మూడు చోట్ల ఎంపీగా.. రెండు చోట్ల ఎమ్మెల్యేగా కేసీఆర్..!
ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావంలో ఎన్ని దశలు ఉన్నా కూడా 2009లో కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్షే మలి దశ ఉద్యమానికి టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. అయితే ఇన్నేళ్లలో కేసీఆర్ ఐదు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి చట్ట సభలకు ఎంపికై ఓ రికార్డు క్రియేట్ చేశారు. ఆయన మూడు నియోజకవర్గాల్లో ఎంపీ గా పోటీ చేసి గెలిస్తే... రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే గెలిచారు. ముందు 2001 ఉప ఎన్నికల్లో సిద్ధిపేట నుంచి గెలిచిన కేసీఆర్, 2004 జనరల్ ఎన్నికల్లో సిద్ధిపేట ఎమ్మెల్యే గా, కరీంనగర్ ఎంపీ గా పోటీ చేసి రెండు చోట్లా విజయం సాధించారు.
తర్వాత 2006 లో కరీంనగర్ ఉప ఎన్నికల్లో మళ్లీ గెలిచారు. 2009లో మాత్రం ఆయన మహబూబ్ నగర్ ఎంపీ గా కేవలం 14 వేల స్వల్ప తేడాతో గెలిచారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ప్రత్యేక రాష్ట్ర కళ సాకారం అయిన వేళ ఆయన గజ్వేల్ నుంచి ఎమ్మెల్యే గా, మెదక్ నుంచి ఎంపీగా ను పోటీ చేశారు. రెండు చోట్లా కేసీఆర్ విజయం సాధించారు. తర్వాత మెదక్ ఎంపీ గా రాజీనామా చేశారు. ఇక మొన్న 2018 ఎన్నికల్లో మరోసారి గజ్వేల్ నుంచి ఆయన రెండో సారి ఎమ్మెల్యే గా గెలిచారు.