పాపం కేరళ... ఆరంజ్ అలర్ట్ జారీ చేసిన సర్కార్...!
భారీ వర్షాలకు కేరళలో ఇప్పటికే 40 మంది మృతి చెందారు. వందల మంది గల్లంతయ్యారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. పునరావాస కేంద్రాల్లో లక్షల మంది ఆశ్రయం పొందుతున్నారు. కొండచరియలు విరిగి పడటంతో... ఇప్పటికే పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ఇళ్లు నీట మునిగిపోయాయి. వరద నీటి కారణంగా గల్లంతైనా వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. అరేబియా మహా సముద్రంలో ఏర్పడిన అల్ప పీడన ద్రోణి కారణంగా... మరో వారం రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలు ఇప్పటికే కేరళలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలిగించాయి. కేరళలో ప్రధానమైన ఇడుక్కి డ్యామ్ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. డ్యామ్ గేట్ల ద్వారా దిగువకు దాదాపు 10 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే దిగువ నున్న ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. భారీ వర్షాల నేపథ్యంలో... ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇప్పటికే అత్యవరస సమావేశం కూడా నిర్వహించారు.