నీకు విలువ లేనప్పుడు ఎందుకు, ఇటు రా... వంగవీటికి కొడాలి మరో సలహా...?
ఇక నాని, రాధా ఇద్దరూ కూడా 2004లోనే తొలి సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు . వీరిలో నాని టీడీపీ నుంచి, రాధా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే లు అయ్యారు. ఇక 2009లో అయితే కొడాలి మరో సారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రాధా ప్రజారాజ్యం లోకి వెళ్లి పోటీ చేసి ఓడిపోయారు. వంశీ టీడీపీ నుంచి విజయవాడ ఎంపీ గా పోటీ చేసి ఓడిపోయారు. అలా వీరి రాజకీయం మలుపులు తిరుగుతూ వస్తోంది. ప్రస్తుతం కొడాలి నాని ఏపీ మంత్రి గా ఉన్నారు.
వంశీ గత ఎన్నికల లో టీడీపీ నుంచి గన్నవరంలో రెండో సారి ఎమ్మెల్యే గా గెలిచినా తర్వాత వైసీపీకి దగ్గరయ్యారు. కట్ చేస్తే ఎన్నికల కు ముందు వరకు వైసీపీ లో ఉన్న రాధా ఆ తర్వాత టీడీపీలోకి వచ్చారు. ఇక ఇప్పుడు టీడీపీలో రాధాకు ప్రయార్టీ లేదన్న చర్చ కొంత వరకు ఉంది. అందుకే ఇటీవల రాధా అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు.
గుడివాడ లో తిరగడం పట్ల, కొడాలి నానీ ని కలవడం పట్ల రాధాకు అచ్చెన్నాయుడు ఒక వార్నింగ్ ఇచ్చారట. అయితే అప్పటి నుంచి ఈ విషయం టీడీపీ వాళ్లకు తెలియడంతో వారు రాధా కు దూరం దూరంగా ఉంటున్నట్టు భోగట్టా ? అయితే కొడాలి నానికి వైసీపీలోకి రావాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో ? చూడాలి.