వంతెన కింద ఇరుక్కున్న విమానం.. అక్కడికి ఎలా వచ్చిందబ్బా?

praveen
సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడో జరిగిన ఘటనలు కూడా క్షణాల్లో అందరూ తెలుసుకోగలుగుతున్నారూ. అయితే ఇలాంటి సమయంలోనే కొన్ని కొన్ని ఘటనలు అటు నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.  మరిముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయే కొన్ని ఫోటోలను చూస్తే అది నిజమా అబద్దమా కూడా అర్థం కాని విధంగా ఉంటుంది. కానీ ఫోటో కి సంబంధించిన అసలు విషయం తెలిసి అందరూ అవాక్కవుతు ఉంటారు. ఇక్కడ ఇలాంటి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది.

 సాధారణంగా విమానాలు రన్ వే వైపు పరుగులు పెట్టి ఆ తర్వాత గాల్లోకి ఎగిరి పోతూ ఉంటాయి.  ఇలా విమానాలు రన్ వే వైపు పరుగులు పెడుతున్న సమయంలో అడ్డుగా ఏమీ ఉండవు అని చెప్పాలి.  కానీ ఇక్కడ ఒక ఫోటోలో మాత్రం ఏకంగా ఒక విమానం రోడ్డుపై బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది.  ఇది ఆ బ్రిడ్జి కింద ఎలా ఇరుక్కుపోయింది అన్నది ఎవరికీ అర్థం కాని విధంగా మారిపోయింది.  ఒకవేళ విమానం క్రాష్ అయ్యి ఉంటే ఎంతో డ్యామేజ్ అయ్యేది. కానీ ఏదో పెద్ద ట్రక్కు ఇరుక్కుకున్నట్లుగా విమానం సరిగ్గా బ్రిడ్జి కింద ఎలా ఇరుక్కు పోయింది అని అందరూ ఆశ్చర్యపోతున్నారు ఈ ఫోటో చూసి.

 కానీ అసలు ఏం జరిగిందంటే.. ఇటీవలే ఎయిరిండియా విమానం వంతెన కింద ఇరుక్కుపోయిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న ఢిల్లీ హైవేఫై చోటుచేసుకుంది.  అయితే ఆ విమానానికి  లెక్కలు లేకపోవడం గమనార్హం. ఇక ఇది ఎలా ఇరుక్కుంది అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కాగా దీనిపై ఎయిర్ ఇండియా  స్పందించింది. తాము అమ్మేసిన  పాత విమానాన్ని కొన్న వ్యక్తి ట్రాలీలో తరలిస్తుండగా వంతెన కింద ఇరుక్కుపోయింది అంటూ క్లారిటీ ఇచ్చింది. ఈ ఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదు అంటూ స్పష్టం చేస్తోంది ఎయిర్ ఇండియా సంస్థ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: