మళ్లి పెరిగిన పెట్రో, డీజిల్ ధరలు! ప్రస్తుతం ఎంతంటే?
తాజా గా మన దేశంలో మళ్లి పెట్రోల్, డిజిల్ ధరలు పెరిగాయి. ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర రూ. 60 నుంచి రూ. 100 లనే గతం లోనే క్రాస్ చేసింది. అక్కడ కూడా నియంత్రణ లో ఉండకా పెరిగిపోతూనే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.27 గా ఉంది. అలాగే ఇప్పుడు తాజాగా లీటర్ డీజిల్ పై 26 పైసల్ పెరిగి రూ. 97.17 కు పెరిగింది. ఇలా పెట్రో డీజిల్ ధరలు పెరుగుతూ పోతుంటే టూ వీలర్ వాహానాధారులు విసిగి పోయారు. పెట్రో వాహానాల కంటే ఛార్జింగ్ వాహానల వైపు దృష్టి మరల్చారు. ఇప్పటికే చాలా కంపెనీలు ఛార్జింగ్ ద్వి చక్ర వాహానాలను విడుదల చేశాయి. అలాగే టెస్లా అనే కంపెనీ వారు ఛార్జింగ్ కార్ల ను విడుదల చేశారు. ఇప్పుడు తాజా భారత దేశంలోనూ ఛార్జింగ్ కార్లను విడుదల చేయడానికి సన్నాహాకాలు చేస్తున్నారు.
తాజాగా పెరిగిన ధరలతో హైదరాబాద్ లీటర్ పెట్రోల్ ధర రూ. 105.27 డీజిల్ ధర రూ. 97.17 గా ఉంది అలాగే వైజాగ్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.23 డీజిల్ ధర రూ. 97.65 కి చేరుకుంది. గుంటుర్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.5 డీజిల్ ధర రూ.98.88 గా ఉంది. గతంలో నే పెట్రోల్ ధర లీటర్ కు రూ. 110 వరకు చేరుకుంది. కానీ ఇటివల కాస్త తగ్గినా మళ్లీ పెరగడంతో వాహానా దారులలో భయం నెలకోటుంది. ఇలా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతుంటే విధ్యుత్ వాహానాల వాడకం పెరిగే అవకాశం ఉంది.