దూకుడు పెంచిన కాంగ్రెస్.. సీనియర్, అధికార ప్రతినిధుల నియామకం !

Veldandi Saikiran
సీనియర్ అధికార ప్రతినిధులను, అధికార ప్రతినిధులను ప్రకటించింది తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ. కొత్త ప్రకటించిన టీపీసీసీ లో ఐదుగురు సీనియర్ అధికార ప్రతినిధులను, 8 మంది అధికార ప్రతినుదులను ఒక సమన్వయ కర్తను నియమించారు  టీపీసీసీ అధ్యక్షులు  రేవంత్ రెడ్డి. అలాగే... 10 మంది సీనియర్ ఉపాద్యక్షులకు పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా పని విభజన చేశారు  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..
సీనియర్ అధికార ప్రతినిధులు :  సీనియర్‌ అధికార ప్రతి నిధులు గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య,  ఆదివాసీ కాంగ్రేస్ జాతీయ నాయకులు బెల్లయ్య నాయక్, సీనియర్ నాయకులు  అద్దంకి దయాకర్, జెడ్పి ఫ్లోర్ లీడర్ మేడ్చల్  హరి వర్ధన్ రెడ్డి, మహిళ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు నేరేళ్ల శారద ఉన్నారు.
అధికార ప్రతినిధులు గా మానవతా రాయ్,  ఎం.డి రియాజ్,  రవళి రెడ్డి, కైలాష్ నేత, రామ చంద్రారెడ్డి, కల్వ సుజాత, సంకేపల్లి సుధీర్ రెడ్డి మరియు చారగొండ వెంకటేష్  ఉన్నారు. ఇక అధికార ప్రతినిధుల సమన్వయ కర్త  అయోధ్య రెడ్డి గా నియామకం అయ్యారు..  

సీనియర్ ఉపాధ్యక్షుల పని విభజన నాయకులను కూడా నియమించింది కాంగ్రెస్‌.. పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా..సంబాని చంద్రశేఖర్ (వరంగల్ మరియు భువనగిరి),  ఆర్.దామోదర్ రెడ్డి (మెదక్ మరియు నిజామాబాద్)  మల్లు రవి (మల్కాజిగిరి మరియు హైదరాబాద్), సురేష్ కుమార్ షెట్కార్ (ఖమ్మం మరియు మెదక్ ) వేం నరేందర్ రెడ్డి (మహబూబ్ నగర్ మరియు చేవెళ్ల) జి.నిరంజన్ (పెద్దపల్లి మరియు సికింద్రాబాద్) కుమార్ రావ్ (ఖమ్మం మరియు నల్గొండ),  రమేష్ ముదిరాజ్ (నాగర్ కర్నూల్ మరియు జహీరాబాద్ ) పొడెం వీరయ్య (ఆదిలాబాద్) జఫ్ఫార్ జవీద్ కు అనుబంధ సంఘాల బాధ్యతలు అప్పగించారు రేవంత్‌ రెడ్డి.  సీనియర్ ఉపాధ్యక్షులకు కేటాయించిన పార్లమెంట్ నియోజక వర్గాల బాధ్యతలను ఆయా నియోజక వర్గాల కార్య నిర్వాహక అధ్యక్షులతో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు రేవంత్‌ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: