మీసం తిప్పుతున్న రొయ్య..!
ఇన్నాళ్లూ గ్యాప్ ఇచ్చిన టైగర్ రొయ్యలు.. మళ్లీ మీసం మెలేస్తున్నాయి. ఆంధ్రా టైగర్ రొయ్యలు మళ్లీ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. దాదాపు 20ఏళ్ల క్రితం అక్వారంగంలో రారాజుగా ఉన్న ఈ రొయ్యలపై వైరస్ లు అటాక్ చేశాయి. దీంతో టైగర్ రొయ్యలకు బ్యాడ్ టైమ్ వచ్చేసింది. ఇంకేముందీ వాటికి డిమాండ్ కూడా పడిపోయింది. ఇంకేముందీ టైగర్ రొయ్యల ప్లేస్ లో వెనామీ రొయ్యలు వచ్చి చేరాయి. అయితే వెనామీలో కూడా టైగర్ లాగానే వైరస్ ల మూకుమ్మడి దాడి జరిగింది. ఇదిలా ఉంటే మళ్లీ టైగర్ రొయ్యలపైనే రైతుల మనసు పడింది. వాటి సాగు చేయాలని ఆరాట పడుతున్నారు. ఇటీవల గుంటూరు జిల్లాలోని తీర ప్రాంత రైతులు.. దాదాపు నాలుగు వేల ఎకరాల్లో టైగర్ రొయ్యల పెంపకం చేపట్టి విజయం సాధించారు. ఇంకేముందీ నెల్లూరు, ప్రకాశం జిల్లా వాసులు కూడా ఇదే బాట పట్టారు.
అమెరికాకు చెందిన ఓ సంస్థ మళ్లీ టైగర్ టైమ్ వచ్చేందుకు కృషి చేసి.. అందులో విజయం సాధించింది. తల్లి రొయ్యలను డెవలెప్ చేసి టైగర్ రొయ్యల ఉత్పత్తిని చేపట్టింది. నెల్లూరు జిల్లాలో ఉత్పత్తిని చేపట్టి.. ఇతర జిల్లాలకు విస్తరింపజేసింది.