ల్యాండింగ్ టైం లో పేలిన విమానం టైరు.. తర్వాత ఏమైందంటే ?

Satvika
విమానం గాల్లోనే ఎగురుతుంది.. నేలమీద టేకాఫ్, ల్యాండింగ్ ఒకటే ఉంటుందన్న విషయం అందరికి తెలిసిందే. ఏదైనా వస్తువు పైనుంచి కిందకు వస్తున్నప్పుడు చాలా వేగంగా వస్తుంది. అప్పుడు వాటికి ఉన్న టైర్ల సాయం తో నేల మీదకు వస్తాయి.విమానాలకు ఉన్న టైర్స్ నేల మీదకు దించడానికి సహాయ పడతాయి.. అలాంటి ప్రధాన పాత్ర పోషిస్తున్న టైర్స్ విమానం కిందకు దిగే ఆఖరి క్షణంలో పేలి తే పరిస్థితి ఏంటీ? ఊహించుకోవడానికి భయంగా ఉంది.. కదా.. అలాంటి ఘటనే ఇప్పుడు జరిగింది.

కొద్ది క్షణాల్లో కిందకు వస్తుంది అనే సమయంలో టైరు పేలింది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఊహకు అందని విషయం.. ఈ ఘటన సోమవారం రాత్రి కర్ణాటకలోని హుబ్బళ్లి విమానాశ్రయంలో చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.. విమానం లో ఉన్న ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు అంతా సురక్షితంగా ఉన్నారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  వివరాల్లొకి వెళితే... కేరళ లోని కణ్ణూరు నుంచి సోమవారం రాత్రి 8.15 గంటల కు కర్ణాటక లోని హుబ్బళ్లి చేరుకున్న ఇండిగో సంస్థకు చెందిన విమానం కిందకు దిగే సమయం లో ముందు వైపు ఉన్న టైర్‌ పేలింది.
 

ఈ ఘటనకు ముఖ్య కారణం ఎదురుగా వేగంగా వీస్తున్న గాలే అని పైలెట్ చెప్పారు. కిందకు దిగే గాలి కారణంగా ల్యాండ్ చేయడానికి చాలా కష్టపడినట్లు అధికారులు వెల్లడించారు. విమానం మెయింటెనెన్స్ జరుగుతోందని, విమాన సిబ్బంది, ప్యాసింజర్స్ అందరూ క్షేమంగానే ఉన్నారని ఇండిగో ఎయిర్‌లైన్స్ సోషల్ మీడియా ద్వారా  ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ విమానం టైర్ రెడీ అయిన వెంటనే మధ్యాహ్నం రెండు గంటలకు ప్రయాణానికి సిద్ధమైందని ఇండిగో అధికారులు పేర్కొన్నారు. ఏది ఏమైనా పెద్ద ప్రమాదమే తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: