కరోనాకు భయపడకండి ... పిల్లల తల్లితండ్రులు ఇలా చేయండి ?
* పిల్లకు ఇచ్చే ఆహారంలో ఆకుకూరలు ఎక్కువగా ఇవ్వాలి. క్యారెట్ బీట్రూట్ లను తరచూ పిల్లల ఆహారంలో చేర్చాలి. తాజా పండ్లు తినేలా చూసుకోవాలి . గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు చేయాలి. టీవీ లకు ఫోన్ లకు అతుక్కొని పోకుండా, ఎక్కువగా ఆటలు ఆడుకునేలా ప్రోత్సహించాలి.
* మట్టిలో ఆడటం మంచిదే అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. కనీసం వారానికి ఒకసారి లేత వేపాకు చిగురు కొంచెం పిల్లలకు తినిపించాలి. మంచి నీళ్లు బిందెలో కొంచెం తులసి ఆకు, కొంచెం పుదీనా ఆకు వేసి ఉంచి ఆ నీటిని తాగడం మంచిది.
* జంక్ ఫుడ్ ను పూర్తిగా ఇవ్వడం మానేయండి. మొలకెత్తిన విత్తనాలు తినిపించడం చాలా మంచిది. అప్పుడప్పుడు గోరువెచ్చటి పాలలో చిటికెడు పసుపు వేసి తాగించండి.
* పిల్లలు మానసికంగా ఒత్తిడికి గురి కాకుండా చూసుకోండి. తరచూ తిట్టడం, కొట్టడం వంటివి మానేయాలి. ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదకరంగా పెరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇవన్నీ పాటించడం ద్వారా మీ పిల్లలు మానసికంగా శారీరకంగా దృఢంగా తయారవుతారు. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, తద్వారా కరోనాని చాలా సులభంగా జయించగలుగుతారు.