ఇలా చేస్తే.. థర్డ్ వేవ్ అస్సలు రాదట?

praveen
ప్రస్తుతం దేశం లో సెకండ్ వేవ్ కరోనా వైరస్ విజృంభిస్తుంది. ఈ నేపథ్యం లో కరోనా వైరస్ పేరెత్తితే చాలు ప్రజలందరూ ఉలికిపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యం లో ప్రజలందరూ బెంబేలెత్తి పోతున్నారు. మొదటి రకం కరోనా వైరస్ తో పోల్చి చూస్తే రెండవ రకం కరోనా వైరస్ మరింత తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతూ ఉండడం అటు ప్రజలను బెంబేలెత్తిస్తోంది అని చెప్పాలి. ఇలాంటి నేపథ్యంలో రోజు రోజుకు వైరస్ కేసులు సంఖ్య అంతకంతకూ పెరిగి పోతోంది. ప్రజలలో వైరస్ భయం కూడా అంతకంతకు పెరిగి పోతూ ఉండటం గమనార్హం.

 ఇలా రోజు రోజుకు కరోనా సెకండ్ విజృంభిస్తు  అందరిలో ప్రాణ భయానికి కలిగిస్తూ ఉంటే అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా  వైరస్ నియంత్రణకు చర్యలు చేపడుతున్నాయ్. ఇలాంటి తరుణం లోనే ఇక ప్రజలందరినీ మరింత భయాందోళనకు గురి చేసినందుకు కరోనా వైరస్ మూడవ దశ కూడా ఉంటుంది అంటూ వార్తలు వస్తూ ఉండడం అందరినీ బెంబేలెత్తిస్తోంది. త్వరలోనే భారత్లో కరోనా వైరస్ మూడవదశ ఉండే అవకాశం ఉంది అంటూ ఎంతో మంది వైద్య నిపుణులు కూడా చెబుతూ ఉండడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

 అయితే ఇప్పటికే కరోనా వైరస్ సెకండ్ వేవ్ తో అల్లాడిపోతూ  థర్డ్ వేవ్ వస్తుందేమో అని భయభ్రాంతులకు గురి అవుతుంటే ఇటీవలే మధ్యప్రదేశ్ మంత్రి ఉష ఠాకూర్ బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేశారు. యజ్ఞం నిర్వహిస్తే ఇక పూర్తిగా పర్యావరణం శుద్ధి అయి థర్డ్ వేవ్ అపాయం నుంచి తప్పించుకోవచ్చు అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే మంత్రి వ్యాఖ్యలు కాస్త ఎంతో చర్చనీయాంశంగా మారిపోయాయి. ఇప్పటికే కరోనా తో ప్రజలందరూ బెంబేలెత్తిపోతు ఉంటే ఇక మంత్రి  ఇలాంటి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయడం ఏంటి అంటూ అందరూ విమర్శలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: