బంపర్ ఆఫర్.. ఒక్క ఫోన్ రీఛార్జ్ తో.. రోజుకు 2 వేలు పొందొచ్చు..?

praveen
ఈ మధ్యకాలంలో మొబైల్ వాడకం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరి  చేతిలో స్మార్ట్ఫోన్ కనిపిస్తూ ఉంది నేటి రోజుల్లో.  అయితే స్మార్ట్ ఫోన్ ఉంది అంటే ఇక ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఫోన్ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.  ప్రతి ఒక్కరికీ ఇది  తప్పనిసరి. అయితే ఇలా ప్రతి నెలా ఫోన్ రీఛార్జ్ చేసుకునే వారి కోసం ఒక గొప్ప శుభ వార్త సిద్ధంగా ఉంది.  అదిరిపోయే ఆఫర్ మీకోసం అందుబాటులో ఉంది.  ప్రముఖ టెలికాం రంగ దిగ్గజ కంపెనీ వొడాఫోన్ ఐడియా కీలక నిర్ణయం తీసుకుని తమ కస్టమర్లకు తీపి కబుర్లు చెప్పింది.

 ఇటీవలే కస్టమర్లు అందరికీ ప్రయోజనం చేకూరే విధంగా కొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది వొడాఫోన్ ఐడియా. ఇటీవలే వొడాఫోన్ ఐడియా ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ తో జతకట్టింది.  ఈ క్రమంలోనే కస్టమర్ల అందరికీ ప్రయోజనం చేకూరే విధంగా రెండు రకాల కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ లను అందుబాటులోకి తీసుకువచ్చింది వోడాఫోన్ ఐడియా.  ఇందులో 51 రూపాయల ప్లాన్ అయితే మరొకటి 301 రూపాయల ప్లాన్. ఇక వొడాఫోన్ ఐడియా కస్టమర్లు ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.

 ఇక రీఛార్జ్ పొందడంతోపాటు హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా వొడాఫోన్ ఐడియా వినియోగదారులు పొందేందుకు అవకాశం ఉంటుంది. కరోనా  వైరస్ సహా ఇతర అనారోగ్యానికి కూడా ఇన్సూరెన్స్ పాలసీ వర్తిస్తుంది అని వొడాఫోన్ ఐడియా తెలిపింది.  మెడికల్ ఎమర్జెన్సీ తో హాస్పిటల్ లో చేరితే ప్రతిరోజూ వెయ్యి రూపాయల వరకు లభిస్తాయి పది రోజుల వరకు ఇలా  ఇన్సూరెన్స్ పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇక  ఐసీయూలో చేరితే ప్రతిరోజు రెండు వేల రూపాయలు అందిస్తారు.  అయితే 18 ఏళ్ల నుంచి 55 ఏళ్లలోపు వయస్సు ఉన్న కస్టమర్లకు మాత్రమే బెనిఫిట్స్ లభిస్తాయి అన్నది మాత్రం ముందుగా కస్టమర్లు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: