డిప్యూటి కలెక్టర్లను భారీగా బదిలీ చేసిన సర్కార్

Gullapally Rajesh
21మంది డిప్యూటీ కలెక్టర్ లను బదిలీచేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు ఏపీ సిఎస్ ఆధిత్యనాధ్‌ దాస్‌. ఎం.వి.సూర్యకళను దేవాదాయ శాఖ సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్ధానం ఈఓగా బదిలీ చేసారు. ఎం. విజయకుమార్‌ను తెలుగుగంగా ప్రాజెక్ట్‌ నెల్లూరు విభాగం స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ చేసారు. జె. శివశ్రీనివాస్‌ను అసిస్టింట్‌ సెక్రటరీగా చీఫ్‌ కమీషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ర్టేషన్‌, విజయవాడకు బదిలీ చేసారు. డి. కోదండరామిరెడ్డిని చిత్తూరు ఫారెస్ట్‌ సెంటిల్‌మెంట్‌ ఆఫీసర్‌గా బదిలీ  అయ్యారు.
ఎ. శ్రీరామచంద్రమూర్తిని ఆంధ్రప్రదేశ్‌ విజిలెన్స్‌ కమీషన్‌కు బదిలీ చేసారు. ఎం. శ్రీదేవిని కృష్ణపట్నం హైదరాబాద్‌ పైప్‌లైన్‌ ప్రాజెక్ట్‌కు కాంపిటెంట్‌ అధారిటీగా ఒంగోలుకు బదిలీ చేయగా జె. అద్దయ్యను మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీకి స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ చేసారు. జి.వి. సుబ్బారెడ్డిని శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్ధానం, ద్వారకతిరుమలకు ఈ.ఓగా బదిలీ చేయగా ఎ.బి.వి.ఎస్‌.బి. శ్రీనివాస్‌ను తూర్పుగోదావరి జిల్లా కెఆర్‌ఆర్‌పికి స్పెషల్‌ డిప్యూటీ కలెలక్టర్‌గా బదిలీ చేసింది ప్రభుత్వం.
ఎన్‌. శ్రీనివాసులను తిరుపతి లీగల్‌ సెల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ చేయగా ఎ.మహాలక్ష్మీదేవిని చీఫ్‌ కమీషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ర్టేషన్‌ విజయవాడకు అసిస్టెంట్‌ సెక్రటరీగా బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వి.సాధన (ఎ.ఎం.ఆర్‌.డి.ఏ) అమరావతి మెట్రోపాలిటన్‌ రివిజన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీకు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ చేసింది సర్కార్. డి. రామూనాయక్‌ జిఎన్‌ఎస్‌ఎఫ్‌ యూనిట్‌ 3 ముద్దనూరు కడప జిల్లా కు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ చేసారు. బి. చిన్న ఓబులేసు నెల్లూరు జిల్లా డిస్ర్టిక్ట్‌ రెవెన్యూ ఆఫీసర్‌గా బదిలీ చేసింది సర్కార్.
కె. హేమలతను నేషనల్‌ హైవే 16 విశాఖపట్నం భూ సమీకరణకు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. టి. బాపిరెడ్డి నెల్లూరు జిల్లాలో ఆసరా, సంక్షేమ పథకాల అమలుకు జాయింట్‌ కలెక్టర్‌గా బదిలీ చేసారు. కె.కృష్ణవేణి ప్రకాశం జిల్లా ఆసరా, సంక్షేమ పధకాల అమలుకు జాయింట్‌ కలెక్టర్‌గా బదిలీ చేసింది సర్కార్. జి.వి. సత్యవాణి తూర్పుగోదావరి జిల్లా ఐసిడిఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌గా బదిలీ చేసారు. కె.ఎం. బర్తారోస్మాండ్‌ నెల్లూరు జిల్లా ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా బదిలీ చేసింది ప్రభుత్వం. కె.ఎస్‌.భాగ్యరేఖ చీఫ్‌ కమీషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ర్టేషన్‌, విజయవాడలో అసిస్టెంట్‌ సెక్రటరీగా బదిలీ చేసారు. కె. దినేష్‌ కుమార్‌ను ఏపీఎన్‌ఆర్‌టి సొసైటీ సీఈఓగా డిప్యూటేషన్‌ పై నియమించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: