అనంతపురం జిల్లాలో క్షుద్రపూజల కలకలం..!?

N.ANJI
ఏపీలో గత కొద్దీరోజుల నుండి క్షుద్రపూజల ఘటనలు కలకలం రేపుతున్నాయి. చిత్తూరు జిల్లా మదనపల్లి ఘటన మరవక ముందే ఏపీలో మరో ఘటన చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లాలో క్షుద్రపూజల కలకలం రేగింది. బొమ్మనహళ్ మండలం ఉంతకల్లు గ్రామం సమీపంలోని తుంగభద్ర హైలెవల్ కాలువలో స్థానికులు గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించారు. అయితే కాలువ గట్టుపై దృశ్యాలను చూసి బెంబేలెత్తిపోయారు. ఇక ఘటన  రక్తపు మరకలతో పాటు నిమ్మకాయలు, పూజలు చేసిన ఆకులను గుర్తించారు. దీన్నిబట్టి చూస్తే అక్కడ క్షుద్రపూజలు జరిగినట్లు అనుమానిస్తున్నారు.
ఇక అమవాస్య కావడంతో గురువారం తెల్లవారుజామున యువకుడ్ని నరబలి ఇచ్చిఉంటారని భావిస్తున్నారు. తొలుత యువకుడ్ని బండరాయితో కొట్టి చందిన దుండగులు, ఆ తర్వాత మృతదేహానికి నిప్పంటించారు. మృతదేహంపై దుస్తులు కూడా లేకపోవడంతో క్షుద్రపూజల అనుమానాలు బలపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి నిమ్మకాయలు, ఆకులు, ఇతర పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ఇక కాలువ గట్టుపై పాదాల ముద్రలతో పాటు ఇతర ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఇక యువకుడి గురించి ఎలాంటి అనవాళ్లు లేకపోవడం, స్థానికులు గుర్తింలేకపోవడంతో పోలీసులకు సవాల్ గా మారింది. దీంతో డాగ్ స్క్వాండ్ ను రంగంలోకి దించారు. అలాగే ఉంతకల్లితో పాటు బొమ్మనహళ్ మండలంలో క్షుద్రపూజలు, తాయత్తులు కట్టేవారి వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే మిస్సింగ్ కేసులను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఇక మృతుడు యువకుడు కావడం. .మృతదేహంపై దుస్తులు లేకపోవడం, అమవాస్య ఘడియలు కావడంతో ఖచ్చితంగా నరబలి జరిగి ఉంటుందన్న అనుమానాలు బలపడుతున్నాయి. మరోవైపు మదనపల్లి జంట హత్యల కేసు ఘటన నేపథ్యంలో పోలీసులు అదే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. అమవాస్య ఘడియల్లో నరబలి ఇస్తే శక్తులు వస్తాయని, నిధులు దొరుకుతాయన్న నమ్మకాలు చాలా మందిలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: