ఈ చంద్రబాబుకు ఏమైంది.. ఏంటి.. మరీ ఇలా చేస్తున్నారు..?

Chakravarthi Kalyan
టీడీపీ అధినేత చంద్రబాబు తీరును పరిశీలించారా.. ఇటీవల వచ్చిన మార్పును గమనించారా.. చంద్రబాబు .. పార్టీ విషయాలపై బాగా దృష్టి పెడుతున్నారు. ఎంతగా అంటే.. చివరకు పంచాయతీ ఎన్నికల విషయంలో కూడా ఆయన కాన్ఫరెన్సులు పెడుతున్నారు.. పార్టీ విషయాలను ఎప్పటికప్పుడు  తెలుసుకుంటున్నారు.. ఇవాళ కూడా పంచాయతీ తొలిదశ ఎన్నికలపై ఆయన సమీక్ష నిర్వహించారు. కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో  టీడీపీ అభ్యర్థులు గెలిచినప్పటికీ ఫలితాలు ప్రకటించకుండా  వైసీపీ నాయకులు అరాచకం చేస్తున్నారని విమర్శించారు.  

ఎన్నికల ఫలితాలను  అన్ని జిల్లాల నేతలతో నేరుగా మాట్లాడుతూ మానిటరింగ్ చేస్తున్నారు చంద్రబాబు. అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఈ సమీక్ష జరుగుతోంది. కావలి రూరల్ మండలం చలంచర్లలో టీడీపీ గెలిచినప్పటికీ ప్రకటించకుండా కావలి ఎమ్మెల్యే వెళ్లి రుబాబు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. వెంటనే ఎస్సీలు, కలెక్టర్లు స్పందించి గెలిచిన చోట డిక్లేర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దాడులకు పాల్పడ్డ అధికార పార్టీ వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

మరో విషయం ఏంటంటే..  సీఎం జగన్ వైఖరి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఆయన అస్సలు ఈ పంచాయతీ ఎన్నికల జోలికి వచ్చినట్టే కనిపించడం లేదు. ఎన్నికల వ్యవహారం మొత్తం పార్టీ నేతలకు వదిలేసినట్టు కనిపించింది. ఎక్కడికక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలకే పంచాయతీ ఎన్నికల వ్యవహారాన్ని జగన్ వదిలేసినట్టు కనిపిస్తోంది. అసలు ఎన్నికల పై ఆయన సమీక్షించడం కానీ.. నేతలతో మాట్లాడటం కానీ.. ఎక్కడా జరిగినట్టు కనిపించడం లేదు.

మరి చంద్రబాబు కష్టం ఫలిస్తుందా.. తెలుగు దేశం మెరుగైన ఫలితాలు సాధిస్తుందా.. అసలు చంద్రబాబు వ్యూహాలు ఇప్పుడు పని చేస్తున్నాయా.. అవి ఔట్ డేటెడ్ అయిపోయాయా అన్న విషయాలు తెలియాలంటే.. పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ చూడాల్సిందే. మరి చూడాలి చంద్రబాబు చాణక్యం పనిచేస్తుందా.. ఒకవేళ ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగు దేశం కాస్తో కూస్తో పుంజుకుంటే.. అందుకు చంద్రబాబే కారణమన్నది నిర్వివాదాంశం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: