చిరు ని కలసిన మంచు విష్ణు... కారణం అదేనా..?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా స్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు స్వయంకృషితో ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక సాదాసీదా నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన చిరంజీవి ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమను శాసించే స్థాయికి ఎదిగాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంచలంచలుగా ఎదిగి టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి ఎంతో మంది యువ హీరోలకు ఇన్స్పిరేషన్ అన్న విషయం తెలిసిందే. అయితే టాలీవుడ్ బిగ్ బాస్ మెగాస్టార్ చిరంజీవి.. నటుడు మంచు మోహన్ బాబు మధ్య ఎలాంటి అనుబంధం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 ఇద్దరు  ఎక్కడ కనిపించినా టామ్ అండ్ జెర్రీ లాగా  ఒకరి పై ఒకరు పంచులు వేసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే అయితే కెరీర్ పరంగా కూడా ఇద్దరికీ ఒకే సమయం లో ప్రారంభం అయింది అని చెప్పాలి. అంతేకాదు  ఇద్దరు కలిసి ఎన్నో సినిమాల్లో కలిసి నటించి ప్రేక్షకులను అలరించారు. అయితే ఇద్దరి మధ్య స్నేహబంధమే  కాదు ఇద్దరి కుటుంబాల మధ్య సాన్నిహిత్యం ద్వారా ఎక్కువగానే ఉంటుంది. ఎప్పుడు చిరంజీవి మోహన్ బాబు పిల్లలు ఎంతో క్లోస్ గా  ఉంటారు. అయితే ఇటీవలే మంచు విష్ణు చిరంజీవిని కలిసి ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. చిరంజీవి అంకుల్ నీ  కలిశానని.. ఎందుకు కలిసానో త్వరలో  చెబుతాను అంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.

 ఆయన దగ్గర నుంచి ఎన్నో సలహాలు తీసుకున్నాను ఇది చాలా గర్వ కారణం ఆయన ఎందుకు మెగాస్టార్ అయ్యారొ  ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు అంటూ కామెంట్ చేశాడు మంచు విష్ణు.  ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా నటించిన మోసగాళ్లకు సినిమాకుసంబంధించి మెగాస్టార్ ను  మంచు విష్ణు కలిసినట్లు ప్రస్తుతం తెలుస్తోంది. అయితే మెగాస్టార్ చిరంజీవి మంచు విష్ణు ఎందుకు కలిశారు అన్నదాని పై అధికారిక ప్రకటన రావాలి అంటే మరి కొన్ని రోజుల వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: