ఒంగోలులో దారుణ హత్య.. ప్రియురాలితో ఫోన్ చేయించి మరి..?

praveen
ఈ మధ్య కాలంలో మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది అన్న విషయం తెలిసిందే. చిన్నచిన్న కారణాలకే దారుణంగా హత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తూనే ఉన్నాయి ఇక్కడ ఇలాంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒంగోలు లో యువకుడి దారుణ హత్య అందరిని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. పట్టపగలే అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై యువకుడిని దారుణంగా హత్య చేసి చంపేశారు. దీంతో స్థానికులు అందరూ తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే ఒంగోలు నగరంలోని గాంధీ పార్క్ వద్ద థామస్ అనే యువకుడిని దారుణంగా హత్య చేశారు దంపతులు.

 అయితే ఈ హత్య వెనుక అసలు కారణం వివాహేతర సంబంధమే అని ప్రస్తుతం పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  సిరికల షాపింగ్ మాల్ లో పనిచేస్తున్న థామస్ అక్కడే పనిచేస్తున్న ఓ వివాహిత తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది.  కొన్నాళ్ల పాటు ఎంతో గుట్టుగా సాగిన వీరి వివాహేతర సంబంధం ఆ తర్వాత భర్తకు తెలిసిపోవడంతో భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ వచ్చాయి ఇక ఆ తర్వాత ప్రియుడి కారణంగా కాపురం పాడు చేసుకోవడం ఇష్టం లేక ఏకంగా ప్రియురాలు థామస్ ను అంతం చేయాలని నిర్ణయించుకుంది.

 భర్త సహకారం కూడా తోడయింది ఈ క్రమంలోనే ఉదయం థామస్ కి ఫోన్ చేసిన ప్రియురాలు గాంధీ పార్క్ కు  కలిసేందుకు రావాలి అంటూ పిలిచింది.  ఇక ప్రియురాలు పిలిచింది కదా అని అటు థామస్ గాంధీ పార్క్ కి వెళ్ళగానే అక్కడ కాపు కాచి ఉన్న ప్రియురాలి భర్త కత్తితో పొడిచి కిరాతకంగా చంపేశాడు.  తప్పించుకుపోయిన థామస్  ను ప్రియురాలు కూడా గట్టిగా పట్టుకోవడం తో ఇక చివరికి విచక్షణ రహితంగా అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: