ఆ ఎంపీపై సీరియస్ అయిన పరిటాల సునీత

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. మాజీ మంత్రి పరిటాల రవిపై హిందూ పురం ఎంపీ  గోరంట్ల మాధవ్ నిప్పులు కక్కారు.రవి నక్సలైట్లు, ఫ్యాక్షనిజం పేరుతో ఎంతో మంది తలలు నరికారని.. చంద్రబాబు సహకారంతో ఎమ్మెల్యేగా ఇలాంటి పనులు చేశారన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో పొలాలకు నీరు లేక ఎండిపోతుంటే.. పరిటాల రవి రక్తపు టేర్లతో పొలాలను తడిపారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పంట పొలాలను రక్తంతో తడిపిన చరిత్ర పరిటాల రవిది అన్నారు. ఎంపీ చేసిన ఈ వ్యాఖ్యలకు సునీత కౌంటర్ ఇచ్చారు. పరిటాల రవి, చంద్రబాబుపై మాధవ్ చేసిన వ్యాఖ్యలపైనా టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఆయన  చేసిన వ్యాఖ్యలపై సునీత  కోప్పడ్డారు.
 మాధవ్‌కు పరిటాల రవి  గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారని.. రవి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీలు ప్రశాంతంగా ఉన్నారన్నారు. ‘నీ చరిత్ర మాకు తెలుసు.. నీలా రోడ్డెక్కి మాట్లాడి మా విలువ తగ్గించుకోలేం.. మరోసారి పరిటాల రవి గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు’అని  పరిటాల సునీత చాలా కోపంగా స్పందించారు...ఇక ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: