ఉత్తరప్రదేశ్ లో దారుణం. టపాసులు కాల్చుతూ ఎంపీ మనుమరాలు మృతి
తాజాగా ఇలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది .. అది కూడా ఒక ఎంపీ గారి ఇంట్లో .. వివరాలలోకి వెళ్తే
ఉత్తరప్రదేశ్ కి చెందిన ఎంపీ రీటా బహుగుణా జోషి ఇంట్లో టపాసులు కాల్చుతూ మనుమరాలు మృతి చెందిన ఘటన వారి ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపింది ...
దీపావళి పండగ సందర్బంగా అందరు టపాసులు కాల్చుతుంటారు .. అయితే రీటా బహుగుణా జోషి ఇంట్లో కూడా దీపావళి పండగని జరిపారు.. అందులో భాగంగా రీటా మనుమరాలు టపాసులు కాల్చుతుండగా ప్రమాదానికి గురైయ్యింది .టపాసు నుండి మంటలు చెలరేగడం తో అవి ఆమె శరీరాన్ని చుట్టుముట్టాయి .. గమనించిన స్థానికులు వెంటనే ఆమెని హాస్పిటల్ కి తరలించారు .. హాస్పిటల్ కి చేరుకునేసరికి ఆమె శరీరం 60 శాతం కాలిపోయింది .. పరిస్థితిని గమనించిన వైద్యులు ఆమెని ఢిల్లీకి తరలించారు ..
ఢిల్లీ లోని మిలిటరీ హాస్పిటల్ కి చేరిన బాలిక అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందింది ..తన మనవరాలికి మెరుగైన చికిత్స ని అందించాలని రీటా బహుగుణా మంత్రులకు మరియు యూపీ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసిన మనవరాలి ప్రాణం నిలువలేదు ... తన మనవరాలి మరణంతో రీటా భాగోద్వేగానికి గురైయ్యింది .. పండగ పూట ఇలాంటి మాట వినవలసి వస్తుందని అనుకోలేదని కుటుంబమంతా శోకసంద్రంలో మునిగిపోయింది ..