ప్రియుడి చేతిలో మహిళా గ్రామ వాలంటీర్ దారుణ హత్య సహజీవనమే కారణమా.. ?

venugopal

లోకంలో మానవ సంబందాలు రోజు రోజుకు దిగజారి పోతున్నాయనడానికి ఈ మద్యకాలంలో జరిగే సంఘటనలు ఉదహరించవచ్చు. ఎందుకంటే మనుషుల మద్య దూరం పెరుగుతుంది. కానీ మనుసులో ఉండే కోరికల మద్య దూరం తగ్గిపోతుంది. అలా తగ్గిన దూరం అనైతిక సంబందాలకు దారి తీస్తుంది. ప్రేమ పంచుకోవడం అంటే శరీరాలు కలవడం అనే భావన చాల మందిలో ఈ మద్య కాలంలో అంకురిస్తుంది.

 

 

ఇకపోతే  మంచి రుచికరమైన పక్వఫలం ఒక మహావృక్షములో ఉంటుందనుకుంటే . ఆ పండు నేలరాలి, దాని విత్తు వేరు పాతుకొని భావికాలపు వృక్షంలా ఎదుగుతుంది. అలాగే ప్రతి మనిషిలో ఉన్న ఆలోచనలే మనసులో రాలిన పండువలే పాతుకుని తన జీవన గమనాన్ని శాసిస్తాయి. ఈ విషయాన్ని గ్రహించక సుఖం కోసం వెంపర్లాడే మనిషి చివరికి పులి చేతికి చిక్కిన లేడిలా తన జీవితాన్ని చేచేతులారా నాశనం చేసుకుంటున్నాడు. ఇలా అక్రమ సంబందాలు ఏర్పరచుకుని ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇకపోతే బందం విలువ తెలియక  శారీరక సుఖం కోసం కలుసుకున్న ఇద్దరు అది దూరమైయ్యాక అతను ఆమె ప్రాణాలు తీసాడు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో జరిగిన ఈ ఘటన వివరాలు తెలుసుకుంటే.

 

 

నర్సీపట్నానికి చెందిన గ్రామ వాలంటీర్ రెడ్డి శ్రీదేవి, మురళీ అనే వ్యక్తితో రెండు సంవత్సరాలుగా సహజీవనం చేస్తోంది. అయితే ఇటీవల వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో గత నెల రోజులుగా వారిద్దరు విడిపోయి ఎవరికి వారు విడి విడిగా ఉంటున్నారు. అయితే ఈ పది రోజుల నుంచి ఆమె మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని చూసిన మురళీ ఆమె పై కోపం పెంచుకుని, మంగళవారం ఒంటరిగా వెళ్తున్న శ్రీదేవిని వెంబడించి, సమయం చిక్కగానే పాత బస్టాండ్ సమీపంలో తల వెనుక భాగంలో రాడ్ తో  కొట్టాడు. ఆ దెబ్బ తల వెనుక భాగంలో గట్టిగా తగిలి తల పగలడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇక విషయం తెలుసుకున్న నర్సీపట్నం టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తూ ప్రారంభించారు. మిగతా వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: