మరో దారుణ ఘటన: చిన్నారుల ప్రైవేట్ పార్ట్స్‌ను టచ్ చేస్తూ వికృతానందం పొందుతున్న కీచక టీచర్‌‌ ?

venugopal

ఒరేయ్ రాక్షసుల్లారా మిమ్మల్ని కన్నది కూడా ఆడదే కదరా? ఎందుకురా అశుద్దం తినే పందుల్లా ఆడపిల్లలమీద పడుతున్నారు అని ప్రతి తల్లిదండ్రులు ఇప్పుడు రోదిస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. మరో వైపు హంతకులను పట్తుకొని శిక్షిస్తూనే ఉన్నారు. కాని ఒక్కడి వొంట్లో భయం లేదు అసలు భయం కలుగడం లేదు. మరి ఏం చేయాలి మగతనానికి కరెంట్ పెట్టి అప్పుడు చూపించమని అడగాలి. ఒరేయ్ పందికొక్కుల్లారా మీ యింట్లో మీకోసం మీ తల్లి చెల్లి ఎదురు చూసినట్లే ఓ ఆడపిల్ల కోసం వారింట్లో కూడా ఎదురు చూస్తారు అని తెలుసుకోండర్రా..

 

 

ఇక సమాజమే ఇలా ఉంటే చదువులు నేర్పే పంతుళ్లకు కూడా ఈ మాయ రోగం తగులుకుంది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు దారితప్పాడు. అభం శుభం తెలియని చిన్నారులను అసభ్యకరంగా తాకుతూ పైశాచికానందం పొందుతున్న కీచక టీచర్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం విద్యార్థినుల తల్లిదండ్రులకు తెలియడంతో పాఠశాల ముందు బైఠాయించి ఆందోళన చేపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇకపోతే ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. మనుషులై పుట్టి అన్నం తినే ప్రతి వారు తలదించుకునే సంఘటన ఇది.

 

 

మంచి నడవడిక, క్రమశిక్షణ నేర్పాల్సిన టీచర్.. విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేసినచేస్తున్నాడు. గుంటూరు జిల్లాలో క్రోసూరులోని ఎస్సీ కాలనీలో పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు కొద్దికాలంగా విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఎనిమిది, తొమ్మిదేళ్ల వయస్సున్న చిన్నారుల ప్రైవేట్ పార్ట్స్‌ను టచ్ చేస్తూ వికృతానందం పొందుతున్నాడట. ఈ దరిద్రుడి అరాచకాలను విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం బయటకు పొక్కింది.

 

 

చిన్నారులు చెప్పింది విని ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు స్కూల్ దగ్గరకు చేరుకుని ఆందోళన చేపట్టారు. మూడు, నాలుగు తరగతుల చిన్నారులపై ఇలాంటి చర్యలకు పాల్పడిన కీచక టీచర్‌‌ని వదిలేది లేదని  వారి వాని మదం అణిచేందుకు సిద్ధమవగా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇకపోతే ఈ విషయం తెలుసుకున్న క్రోసూరు ఎంఈవో వెంటనే స్కూల్ దగ్గరకు చేరుకుని విషయంపై ఆరా తీశారు.

 

 

టీచర్‌ని ప్రశ్నించి, విద్యార్థినులతో జరిగిన ఘటన గురించి తెలుసుకున్నాడు.. అందులో 8,9 ఏళ్లున్న చిన్నారులు తమను ఎక్కడెక్కడ పట్టుకున్నాడో చెప్తుంటే చూసే వారికి సైతం ఇబ్బందిగా అనిపించింది. స్పందించిన ఎంఈవో విషయాన్ని అక్కడికక్కడే డీఈవో దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థినుల పట్ల అసభ్యకరం ప్రవర్తిస్తున్న ఇలాంటి వాన్ని తగిన విధంగా శిక్షించకుంటే ఇలాంటి వెదవలు మరింత మంది సమాజంలో తిరుగుతారని ఆవేశం భాద వ్యక్తం చేసారు పిల్లల తల్లిదండ్రులు.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: