తన కోడలికి పిల్లలు పుట్టడం లేదిని ఈ మామ ఎంత దారుణం చేసాడంటే ?

venugopal

ప్రస్తుత పరిస్దితుల్లో ఆడపిల్లల బ్రతుకులు ఎంత దారుణంగా తయారైయ్యాయంటే ఎక్కడికెళ్లిన భద్రత లేదు. చదువుకునే వయస్సులో స్కూల్లో టీచర్లతో వేధింపులు, బయటకు వస్తే రోడ్డుపైన కామాంధుల కర్కశపు చూపులూ, చివరికి పెళ్లి చేసుకున్నాక. భర్తలే యముల్లా మారుతున్నారంటే వీరికి తోడు అత్త మామల రాక్షసత్వం. పిల్లలు పుట్టాక వారితో నరకం. ఇలా ఆడపిల్ల ఏనాడు ఆనందంగా జీవిస్తుందో తెలియడం లేదు.

 

 

ఇకపోతే బిహార్‌లో తన కోడలికి పెళ్లయి ఏళ్లు గడిచినా సంతానం కలగడం లేదన్న ఆక్రోశంతో అత్తమామలు దారుణానికి పాల్పడ్డారు. వివరాలు తెలుసుకుంటే బిహార్‌లోని బెట్టియా జిల్లాలోని నార్కటియాగంజ్‌లోని షికార్‌పూర్‌కు చెందిన రీటాదేవి అనే మహిళకు ఓ వ్యక్తితో వివాహమైంది. అయితే పెళ్లయి 12ఏళ్లు గడిచినా ఆమెకు సంతానం కలగకపోవడంతో అత్తమామలు తరచుగా నరకం చూపెట్టే వారట. ఈ దశలో ఎన్ని బాధలు పడుతున్న రీటాదేవి తల్లిదండ్రులకు ఏనాడు చెప్పలేదు. ఈ క్రమంలో ఒకరోజు రీటా తమ్ముడు అక్కను చూసేందుకు వచ్చి వెళ్లిన కాసేపటి తర్వాత రీటా చనిపోయినట్లు ఆమె భర్త నుంచి ఫోన్ వచ్చింది. దీంతో అతడు తల్లిదండ్రులను వెంటబెట్టుకుని వారింటికి వెళ్లగా అక్కడ  రీటా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిందట..

 

 

ఈ ఘటనకు భయకంపితులైన తల్లిదండ్రులు షికార్‌పూర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఇంట్లో రీటా భర్త, అత్తమామలు కనిపించకపోవడంతో వారే చంపేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

 

అంతే కాకుండా గొంతుపై కత్తితో కోసినట్లు గాయం ఉండటంతో ఆమెను గొంతు కోసి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీంతో రీటా భర్త, అత్తమామలతో మరో ముగ్గురు బంధువులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన చూస్తుంటే సమాజంలో మానవతా విలువలు ఎంతగా దిగజారుతున్నాయో అర్దం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: