జగన్ కు బాలకృష్ణ స్పెషల్ రిక్వెస్ట్..!

Varma Vishnu

హిందూపురంలో పర్యటిస్తున్నారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. గురువారం నియోజవర్గానికి వచ్చిన బాలయ్య.. లేపాక్షిలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడు రోజుల పాటూ నియోజకవర్గంలోనే పర్యటించనున్న బాలయ్య.. స్థానికంగా ఉన్న సమస్యల్ని అడిగి తెలుసుకోనున్నారు. స్థానిక టీడీపీ నేతలతో సమావేశం కాబోతున్నట్లు తెలుస్తోంది.

 

ఇదిలా ఉంటే.. లేపాక్షి సభలో బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి కష్టపడి పనిచేస్తానన్నారు బాలయ్య.. ప్రభుత్వం బడిబాట కార్యక్రమం కొనసాగించాలని అభిప్రాయపడ్డారు. అలాగే హిందూపురంను జిల్లా మార్చాలని తన మనసులో మాట బయటపెట్టారు. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.

 

అలాగే రాయలసీమ అభివృద్ధికి తనలో చివరి రక్తం బొట్టు ఉన్నంత వరకు పోరాడుతానన్నారు హిందూపురం ఎమ్మెల్యే. మరోవైపు బాలయ్య ప్రసంగం కొనసాగుతుండగా ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. అందరు ఒక్కసారిగా అవాక్కైనా బాలకృష్ణ తేరుకొని తన ప్రసంగాన్ని కొనసాగించారు.. ఇలా...

 

ఆయన ప్రసంగిస్తుండగా.. కరెంట్ కట్ అయ్యింది. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే.. ఇదా ఈ ప్రభుత్వ పరిపాలన తీరు అంటూ ప్రశ్నించారు. రెంటు కోతలు, వేరుశెనగ ఇబ్బందులు అన్ని కష్టాలు ప్రారంభమయ్యాయని బాలయ్య.. సర్కార్‌పై విమర్శలు తూటాల్లా గుప్పించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: