నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపారు!

Edari Rama Krishna

ఈ మద్య హైదరాబాద్ లో నడి రోడ్డుపై ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి.  మొన్నటి మొన్న తమకన్న తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుందని ఓ తండ్రి తన కూతురుపై అమానుషంగా దాడి చేసిన ఘటన మరువక ముందే..హైదరాబాద్ లోని అత్తాపూర్ లో మరో దారుణం చోటుచేసుకుంది. ఉప్పలపల్లి కోర్టులో విచారణకు హాజరై వస్తున్న రమేశ్(35) అనే పాత నేరస్తుడిపై నలుగురు ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో రోడ్డు పై జనాలు తిరుగుతూనే ఉన్నారు..సంఘటన చూసి భయబ్రాంతులకు గురయ్యారు.  


 బజాజ్ ఎలక్ట్రానిక్స్ సమీపంలో బాధితుడిపై విచక్షణారహితంగా కత్తులు, గొడ్డళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ రమేశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.  కాగా దుండగులు బాధితుడైన రమేష్ ని దాదాపు  100 మీటర్లు వెంబడించి మరీ దారుణంగా నరికారు.  ఆ సమయంలో పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్  అక్కడ నుంచే వెళ్లడం విశేషం.  అయితే రమేష్ అనే యువకుడిపై కత్తులతో దాడి చేస్తున్న సమయంలో అక్కడ ఓ యువకుడు ఆపబోయాడు..ఆ సమయంలో దుండగులు కత్తులు రువ్వుతూ అతన్నిబెదిరించారు. 


అంతే కాదు సంఘటన స్థలానికి పోలీసులపై కూడా దుండగుడు కత్తి రువ్వుతూ బాధితుడిపై మరోసారి దాడికి పాల్పడ్డాడు. అయితే ఈ హత్యకు కారణం పాత కక్షలే అని..రాజేంద్ర నగర్ లోని జుమ్మేరాత్ బజార్ లో నివాసముండే రమేశ్.. తన ఇంటికి సమీపంలో ఉండే మహేశ్ గౌడ్ ను గొంతు కోసి చంపిన ఘటనలో నిందితుడిగా ఉన్నాడు. ఇదే కేసులో ఈ రోజు కోర్టుకు వెళ్లి వస్తుండగా మహేశ్ బంధువులు వెంటాడి మరీ చంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: