అన్నా క్యాంటీన్ లో పనిచేసే పిల్లాడికి షాక్ ఇచ్చిన మంత్రి సునీత..!
ఈ క్రమంలో అనంతపురం జిల్లాలో బైపాస్ రోడ్డు ప్రాంగణంలో ఇటీవల ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ని మంత్రి పరిటాల సునీత సందర్శించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఈ క్యాంటీన్ లో ఆహార పదార్థాల తయారీ, నాణ్యత, ముడి సరుకులను ఆమె పరిశీలించారు. ఆహారం ఎలా ఉందని, అక్కడికి వచ్చిన వారిని అడిగారు.
అదే క్యాంటీన్ లో ప్లేట్లు అందిస్తున్న ఓ బాలుడు ఆమె కంట పడటంతో, సునీత అతన్ని పలకరించారు. ఆపై “ఏరా… బడికిపోలేదా? ఇక్కడే ఉంటే తంతా రేయ్ ” అంటూ వార్నింగ్ ఇచ్చారు.
చిన్న పిల్లలను పనిలో పెట్టుకోవద్దని క్యాంటీన్ నిర్వాహకులను హెచ్చరించారు. అంతేకాకుండా మంత్రి సునీత స్వయంగా రూపాయలు ఇచ్చి టోకెన్ తీసుకుని ప్రజలతో భోజనం చేశారు. ఈ సన్నివేశం చూసిన అక్కడ ప్రజలు ఎంతగానో సంతోషించారు.