ఈ మద్య కాలంలో సమాజంలో మానవత్వం పూర్తిగా నశించి పోతుందని ఎన్నో సంఘటనలు రుజువు చేశాయి. తాజాగా తమిళనాడులో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ 30 ఏళ్ల వ్యక్తి తన తల్లిని హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె తలను పట్టుకుని పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. అతన్ని చూసి పోలీసులే షాక్ తిన్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. పుదుక్కోట్టై జిల్లాలోని కరంబకుడి సమీపంలోని మరవంబట్టి గ్రామానికి చెందిన తంగరాజ్, తిలగరాణి (48) భార్యాభర్తలు. వీరికి ఐదుగురు కుమారులు. కొంత కాలంగా పెద్ద కుమారుడు ఆనంద్(23) ఆస్తి పంచివ్వాలంటూ తల్లితో తరచూ తగాదాకు దిగేవాడు. ఆస్తిని తక్షణం పంచి ఇవ్వాల్సిందేనని తల్లిని బెదిరించాడు.
ఆమె అందుకు నిరాకరించడంతో సహనం కోల్పోయిన ఆనంద్ పదునైన కత్తితో విచక్షణ రహితంగా తల్లిపై దాడిచేసి తలను నరికాడు. ఆ తర్వాత తలను పట్టుకుని బైక్పై పెట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. మొండెం నుంచి వేరు చేసిన తలతో వచ్చిన నిందితుడిని చూసి తొలుత పోలీసులు షాక్ తిన్నారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.