భారత దేశంలో రోజు రోజుకీ మహిళలపై అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొంత మంది కామాంధులు వయసుతో సంబంధం లేకుండా రెచ్చిపోయి మరీ అఘాయిత్యాలకు పాల్పపడుతున్నారు. అంతే కాదు మరికొందరు ఉన్మాదులు అత్యాచారం చేసి దారుణంగా హత్య చేస్తున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
తాజాగా విజయనగరం జిల్లా సీతానగరం మండలం గాదెవలసలో దారుణం జరిగింది. నలుగురు కామాంధులు ఓ బాలికపై అత్యాచారం చేశారు. తనను రక్షించమని ఎంత ప్రాధేయపడినా వారి హృదయాలు కరగలేదు..పైగా తమ గుట్టు బయట పడుతుందని భయంతో ఆ బాలికను దారుణంగా హత్య చేశారు.
హత్య చేసి మృతదేహాన్ని చెరువులో పడేశారు.. మృతురాలు బొబ్బిలి మండలం రెడ్డియ్యవలస గ్రామానికి చెందిన బాలికగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు.