నోబుల్ బహుమతిని నార్వీజియన్ కమిటీ తప్ప వెరెవరూ యివ్వలేరు!!!






మానవ జాతికి అత్యుత్తమ ప్రయోజనం చేకూర్చిన వ్యక్తులకు ప్రతి సంవత్సరానికి ఒకసారి నోబుల్ బహుమతి ప్రసాదిస్తారు. 1895 లో ఆల్ఫ్రెడ్ నోబుల్ ఙ్జాపకార్ధం స్థాపించబడిన ఈ అవార్డ్ 5 రంగాలలో మానవజాతి అభివృద్ది ప్రయోజనం కోసం సాధించిన అద్భుత ఆవిష్కరణలకు ప్రధానం చేస్తారు. 


1. రసాయన శాస్త్రం
2. భౌతిక శాస్త్రం
3. వైద్య శాస్త్రం  
4. సాహిత్యం మరియు 
5. ప్రపంచ శాంతి 




"ది స్వెరిజెస్ రిక్స్-బాంక్ ప్రైజ్ " ను కూడా నోబుల్ ప్రైజ్ కేటగిరీలో చేర్చి అర్ధశాస్త్రానికి కూడా 1968 నుండి ప్రధానం చేస్తు న్నారు. అల్ల్ఫ్రెడ్ నోబుల్ విల్ ప్రకారం నిర్దేశించిన నార్వీజియన్ కమిటీ ఎంపిక చేసే ఈ అవార్డ్ ప్రపంచ శాంతికి, అహింసా వాదానికి తనజీవితాన్నే త్యాగం చేసిన  మహాత్మా గాంధికి రాలేదు. 84 సార్లు నామినేట్ చెయ్యబడ్దా ఈ అవార్డ్ రాని దురదృష్ఠ వంతుడు భౌతిక శాస్త్రవెత్త  ఆర్నాల్డ్ సొమ్మెర్-ఫ్లెడ్ లాంటి వాళ్ళూ ఉన్నారు. 




మరణాల వ్యాపారి గా పేరుబడ్ద ఆల్ఫ్రెడ్ నోబుల్ ఒక ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త, ఆయుధ తయారీదారుడు, రసాయన శాస్త్రవేత్త, ఇంజినీర్ కూడా. డైనమైట్స్ లాంటి ప్రేలుడు పదార్ధాలను తయారు చేసి ప్రపంచ యుద్ద కాలములో అద్భుతంగా సంపాదించాడు. తన ఆవిష్కరణతో రూపుదిద్దుకున్న అణ్వాయుధాలతో జరిగిన అణు మారణ హోమానికి స్పందించి తన సోదరుడు లడ్విక్ మరణంతో పొరపాటున ఒక ఫ్రెంచ్ పత్రిక  "మర్చెంట్ ఆఫ్ డెత్ ఈజ్ డెడ్" అంటూ ఆయన సంస్మరణా న్ని ప్రచురించింది. దాంతో బ్రతుకింతేనా? అని ఆలోచించి పశ్చాత్తాపంతో తన సంపదనంతా "నోబుల్ ప్రయిజ్ ఫౌండేషన్" కు వదిలేసి తద్వారా ప్రపంచమానవజాతి అభివృద్ది ప్రయోజనాలకు తగిన ఆవిష్కరణలు సేవలుచేసిన వారికి 1898 నుండి నోబుల్ ప్రైజ్ కు మార్గం సుగమం చేసి 1901 నుండి నోబెల్ ప్రైజ్ ప్రదానం ప్రారంభించారు. 




(It went on to say “"Dr. Alfred Nobel, who became rich by finding ways to kill more people faster than ever before, died yesterday.” Needless to say, reading his own obituary prompted Alfred Nobel to think about his reputation and legacy. As a result, he left most of his fortune to the Nobel Foundation and the Nobel Prize was born)

 
నార్వీజియన్ కమిటీ ఒక విధానం ప్రకారం ఎంపికచేసిన వారికే ఈ బహుమతి ప్రధానం చేస్తారు. విధాన రీత్యా క్రీడలు నోబుల్ బహుమతికి అర్హతను పొందలేదు. కారణం అవి మానవులకు వినోదాన్ని పంచేవే కాని మానవజాతికి వాటి నుండి లభించే ప్రయోజనం నోబుల్ ప్రకారం లేదని అర్ధం. 



ఈ నోబుల్ బహుమతిని స్విడన్ లోని స్టాక్-హోం కు చెందిన   నార్వీజియన్ కమిటీ మాత్రమే ప్రధానం చేస్తుంది ప్రపంచం లోని ఏ ఇతర దేశంగాని రాజకీయనాయకులు గాని ఈఅ అవార్డ్ను ప్రతిపాదించలేరు. ప్రధానం చేయలేరు. చివరకు ఐఖ్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి  కూడా అనర్హుడే.


మరి భారత దేశంలోని ఆంద్రప్రదేశ్ అనబడే చిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఓలంపిక్ క్రీడల్లో గెలిచినవారికి నోబుల్ ప్రైజ్ ఇస్తాననటం లోని ఔచిత్యం, సాధికారత, సాధ్యాసాధ్యాలు ఆయనగారికే తెలియాలి. బహుశ ఆయన చేసిన వాగ్ధాన పరంపర చూస్తే అవి తీర్చలేనివని "శుష్క ప్రియాలు-శూన్య హస్తాలు" మాత్రమేనని 100% బావించవలసివస్తుంది.  




మరోసారి ఆంద్రప్రదేశ్ జనావళికి మనవి ఏమంటే నోబుల్ ప్రైజ్ ను నార్వెజియన్ కమిటీ తప్ప వేరెవరూ ఇవ్వలేరు. ఎవరైనా చెపితే మనల్నందరిని "వెధవ" ల కింద జమకట్టినట్లే.  లేదా ఈ వాగ్ధానం చేసిన వారిని మతిభ్రమించిన వారిగా  జమకట్టాలని ప్రార్ధిస్తున్నారు విఙ్జులు.  
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: