జల్లికట్టు మాటున ఉగ్రవాదం - తమిళనాడ్ ప్రమాదంలో ఉందా?




జల్లికట్టు రద్ధునుంచి ప్రభుత్వం పై పోరాడి సాంస్కృతిక వారసత్వాన్ని నిలుపుకున్న తమిళులు చిక్కుల్లో పడటమే కాదు తమిళనాడును ప్రమాదము లోకి నెట్టేసారు. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ రెట్టించి ప్రశ్నించటం దానికి ఆ రోజు జరిగిన పోలీసుల ప్రయోగించటం పై సమాదానము ఇచ్చారు.   

 

ఈ రోజు తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శాసనసభలో షాకింగ్ విషయాలు చెప్పారు. మొన్న జరిగిన జల్లికట్టు ఉద్య మంలో కొందరు తమిళులు "ప్రత్యేక తమిళ దేశం"  కావాలని డిమాండ్ చేశారని, నిరసనకారులు ఉగ్రవాది  'ఒసామా బిన్ లాడెన్'  ఫొటోలు కూడా చూపించారని వివరించారు. శుక్రవారం తమిళనాడు అసెంబ్లీ లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ మెరినా బీచ్ తో జల్లికట్టుకోసం జరిగిన ఆందోళనలో కొంతమంది "అల్ కాయిదా ఉగ్రవాది లాడెన్" ఫొటో చూపించారని తెలిపారు.



అలాగే, గణతంత్ర దినోత్సవాన్ని కూడా బహిష్కరించాలని డిమాండ్ చేసినట్లు ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. జల్లికట్టు ఉద్యమం ప్రశాంతంగా జరుగుతున్నప్పుడు పోలీసు బలగాలను ప్రయోగించాల్సిన అవసరం ఏ మొచ్చిందని ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ ప్రశ్నించిన నేపథ్యంలో ఆయన ఈ సమాధానం చెప్పారు. కొన్ని సామాజిక వ్యతిరేక శక్తులు జల్లికట్టు ఉద్యమంలో చేరాయని తరవాతనే ఈ దుస్థితి దాపురించిందని చెప్పారు. 


పరిష్కారం చూపిన తర్వాత కూడా రిపబ్లిక్ డే వరకు ఉద్యమం చేద్దాం అని కొందరు రెచ్చగొడుతుంటే అప్పుడు పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ విషయం నేను ప్రమాణ పూర్తిగా చెబుతున్నాను. కొన్ని గ్రూపులు కావాలనే నల్లజెండాలు పనిగట్టుకొని ప్రదర్శించాయని, వారిని అరెస్టు చేసి జైలుకు పంపించినట్లు చెప్పారు. అయితే, ఆరోజు జరిగిన హింసపై న్యాయవిచారణ చేయించాలని స్టాలిన్ డిమాండ్ చేయగా ప్రభుత్వం నిరాకరించడంతో వారు వాకౌట్ చేశారు.


దేశములో సంఘ విద్రోహ శక్తులు విజృంబించటానికి అవకాశం ఇవ్వటం దేశానికి అరిష్టం. దేశం ప్రధానం అనేది మరచి రాజ్యాంగ వ్యవస్థలు పై దాడి చేయటం తీర్పిచ్చిన న్యాయస్థానాలను, జంతు సంరక్షణ సంస్థలపై దాడి చేయటం అంతతేలిక కాదు. దేశమంతా ఐఖ్యంగా ఉంటేనే ఉగ్రవాద ప్రమాదం నుండి రక్షించుకోగలం.       


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: