ఓరి నాయనో.. పక్షి ఈక రూ.23 లక్షలు?

praveen
ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ అనేది ప్రపంచమంతా పాకింది. అయితే ఇంటర్నెట్ పాకిపోయిన ప్రతి చోటికి కూడా సోషల్ మీడియా విస్తరించి పోయింది అని చెప్పాలి  దీంతో ప్రతి ఒక్కరు కూడా నేటి రోజుల్లో సోషల్ మీడియా అనే మాయలోనే మునిగి తేలుతూ ఉన్నారు. ఇక కావాల్సినవన్నీ కూడా అటు సోషల్ మీడియాలోనే దొరుకుతూ ఉండడంతో బయట ప్రపంచంతో పని లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఇక మాట్లాడే మనుషుల దగ్గర నుంచి ఇక వాడే వస్తువుల వరకు అన్ని సోషల్ మీడియాలోనే వెతుక్కుంటున్నారు అందరూ.

 ఇక ప్రపంచ నలుమూలలో ఎక్కడ ఏం జరిగినా కూడా ఇట్టే ఇంటర్నెట్లో వాలిపోతూ ఉంటుంది. ఈ క్రమంలోనే నిమిషాల వ్యవధిలోనే అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో అన్ని విషయాలు తెలుసుకోగలుగుతున్నారు. అయితే ఇలా కొన్ని కొన్ని సార్లు వెలుగులోకి వచ్చే ఘటనలు మాత్రం అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. సాధారణంగా పక్షి ఈక ధర ఎంత ఉంటుంది. పక్షి ఈకకు ధర ఏంటి అసలు దానిని ఎవరైనా కొంటారా అంటారు ఎవరైనా  కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు   ఏకంగా పక్షి ఈకను 23 లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు.

 ఈ ఘటన న్యూజిలాండ్ లో వెలుగులోకి వచ్చింది. అక్కడ అంతరించిపోయిన  huia bird ఈక ఇటీవల వేలంలో రికార్డు ధర పలికింది  100 ఏళ్ల నాటి తొమ్మిది గ్రాములు ఉన్న ఈ పక్షి ఈకను వేలానికి పెట్టగా.. ఏకంగా తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి 23 లక్షల రూపాయలకు ఈ పక్షి ఈకను కొనుగోలు చేశాడు  ఇది బంగారం కన్నా విలువైనది కావడంతోనే.  ఇలా భారీ ధర పలికిందని వేలం నిర్వహకులు తెలిపారు. huia పక్షులు 1907లో చివరిసారిగా కనిపించగా.. 1920 తర్వాత భూమిపై వాటి ఉనికే లేకుండా పోయిందని చెబుతున్నారు నిపుణులు. తెలుపు నలుపు రంగుల్లో చూడటానికి ఇవి ఎంతో అందంగా ఉంటాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: