ప్రతి ఒక్కరూ ఆర్మీలో పనిచేయాల్సిందే.. ప్రభుత్వం కీలక ఆదేశాలు?
అయితే ఇప్పుడు ఇలా ఎవరైనా అనుకుంటున్నారు అంటే వారికి షాక్ తప్పదు అని చెప్పాలి. ఎందుకంటే ఇక ఆర్మీలోకి వెళ్లడం ఇష్టం లేకపోయినా.. ఇక ఇప్పుడు తప్పనిసరిగా సైన్యంలో చేరాల్సిందే. దీనికి సంబంధించి ఏకంగా ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి అని చెప్పాలి. అదేంటి ఇష్టం లేకపోయినా ఆర్మీలో చేరడం ఏంటి అనుకుంటున్నారు కదా.. అంతలా కంగారు పడకండి.. ఇది మన దేశంలో కాదు మయన్మార్ లో. ఆర్మీ ప్రభుత్వం ఇలాంటి కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ దేశ పౌరులు అందరికీ కూడా ఊహించని షాక్ ఇచ్చింది అని చెప్పాలి.
మయన్మార్ దేశంలో అటు సైనికుల సంఖ్య రోజుకి తగ్గిపోతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు వయస్సు ఉన్న పురుషులు.. 18 ఏళ్ల నుంచి 27 ఏళ్ల లోపు వయసు ఉన్న మహిళలు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా రెండేళ్లపాటు ఇక ఆ దేశపు ఆర్మీలో పని చేయాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేసింది. 45 ఏళ్లలోపు స్పెషలిస్ట్ డాక్టర్లు మూడేళ్లు సైన్యంలో సేవ చేయాలి అంటూ ఆదేశించింది. దేశ అవసరాలను బట్టి ఇక ఐదేళ్ల వరకు ఈ పరిమితిని పెంచే అవకాశం కూడా ఉంది అంటూ తెలిపింది. కాగా ఇలా యువకులు ప్రతి ఒక్కరు కూడా ఆర్మీలో పని చేయాలి అనే రూల్ ఇప్పటివరకు 27 దేశాలలో ఉంది అని చెప్పాలి.