50ఏళ్ల నాటి మద్యం సీసా.. ధర ఎంత పలికిందో తెలిస్తే షాకే?

praveen
అప్పుడే తయారైన కొత్తమద్యం కంటే పాత మద్యానికి మార్కెట్లో డిమాండ్ విపరీతంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నెలలు కాదు ఏకంగా కొన్నెళ్ల కిందట తయారైన మధ్యాన్ని ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేయడం కూడా చూస్తూ ఉంటాం. కొన్ని దశాబ్దాల కిందట తయారు చేసిన మద్యాన్ని కొనుగోలు చేయడానికి లక్షలు కాదు.. కోట్ల రూపాయలు కూడా వెచ్చించడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే మార్కెట్లో పాత మద్యానికి ఉన్న డిమాండ్ ను క్యాష్ చేసుకోవాలని అనుకున్నాడు ఇక్కడ ఒక వ్యక్తి. అతని వద్ద కేవలం ఒక్క మద్యం సీసా మాత్రమే ఉంది. ఇక ఆ మద్యం సీసాను వేలంలో పెట్టాడు. అయితే ఇక ఈ పాత మద్యానికి దక్కిన ధర తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు.

 ఏకంగా ఈ ఒక్క మద్యం సీసా కారణంగా సదరు వ్యక్తి కోటీశ్వరుడు గా మారిపోయాడు అని తెలిసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు.  కాలిఫోర్నియాలో ఈ ఘటన జరిగింది. ఒక వ్యక్తి తన వద్ద దాచిపెట్టుకున్న 50 ఏళ్ల నాటి మద్యం బాటిల్ వేలం వేయగా అది కోటి రూపాయలకు అమ్మిడిపోయింది  మార్క్ పాల్సన్ అనే వ్యక్తి 1970 నుంచి ఒక బాటిల్ను కొనుగోలు చేసి అప్పటినుంచి దశాబ్దాలుగా ఆ బాటిల్ను అలాగే నేలమాలికలో  దాచి పెట్టాడు. అప్పుడు ఆ మద్యం బాటిల్ ధర 250 డాలర్లు అంటే ఈరోజు లెక్క చూసుకుంటే 20,000 పెట్టి కొన్నాడు.

 కానీ ఇటీవలే ఆ పాత మద్యం బాటిల్ను వేలంలో పెట్టగా ఏకంగా ఒక లక్ష 6,250 డాలర్లకు ధర పలికింది.  దీంతో అతను దాదాపు 88 లక్షల వరకు ఇక ఈ మధ్య బాటిల్  అమ్మడం ద్వారా సంపాదించాడు అని చెప్పాలి. అయితే తాను ముందుగా ఊహించిన ధర కంటే ఎక్కువ ధరకు ఈ మద్యం బాటిల్ విక్రయించినట్లు చెప్పుకొచ్చాడు. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. అయితే గతంలో కూడా ఇలా దశాబ్దాలనాటి మద్యం సీసాకు ఎక్కువ ధర పలికిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఇతను ఇటీవల వేలంలో పెట్టిన లాంటి మద్యం సీసాలు ప్రపంచవ్యాప్తంగా కేవలం 1300 మాత్రమే ఉన్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri

సంబంధిత వార్తలు: