
పిచ్చి పీక్స్ అంటే ఇదే.. బ్రతికుండగానే అంత్యక్రియలు చేసుకున్నాడు?
ఇలా పిచ్చి ఆలోచనలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిపోతున్నవారు నేటి రోజుల్లో చాలామంది కనిపిస్తున్నారు అని చెప్పాలి. ఇక ఇలాంటి ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ ఒక వృద్ధుడు చేసిన పని కాస్త ప్రతి ఒక్కరిని కూడా ముక్కున వేలేసుకునేలా చేస్తూ ఉంది అని చెప్పాలి. పిల్లలకు దూరంగా ఎన్నో ఏళ్ల నుంచి ఒంటరిగానే జీవిస్తున్నాడు ఆ వృద్ధుడు. ఇటీవలే అతని మనసులో ఒక వింత ఆలోచన తట్టింది.
ఒకవేళ తాను చనిపోతే అంత్యక్రియలు ఎలా జరుగుతాయో తెలుసుకోవాలని ఆశపడ్డాడు. ఈ క్రమంలోనే వింత ఆలోచన చేశాడు. ఇక బ్రతికుండగానే స్థానికుల సమక్షంలో అంత్యక్రియలు జరుపుకున్నాడు సదరు వృద్ధుడు. చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 27వ తేదీన ఈ ఘటన జరిగింది అని చెప్పాలి. అంత్యక్రియల్లో భాగంగా జాంగ్ అనే 84 ఏళ్ల వ్యక్తి.. శవ పేటికపై కూర్చొని ఊరేగాడు. ఇది వినడానికి కాస్త విచిత్రంగా ఉన్న ఎన్నో ఏళ్ల నుంచి ఒంటరి జీవితం గడుపుతున్న జాంగ్ లో ఇక ఇది ఎంతో ఉత్సాహాన్ని నింపింది అంటూ స్థానికులు చెబుతున్నారు.