స్వాతంత్రం కోసం పోరాటం అన్నారు.. సైన్యం రాగానే పారిపోయారు?
వ్యాక్సిన్ వేసుకుని ప్రాణాలు కాపాడు కోవాలి అంటూ కెనడా ప్రభుత్వం చెబితే.. ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందనీ అంటూ ఎంతోమంది ట్రక్ డ్రైవర్లు ప్రభుత్వానికి వ్యతిరేకం గా ఉద్యమాలు బాట పట్టారు. ఈ క్రమం లోనే వేల ట్రక్కులను రహదారుల పై నిలిపి వేసి పూర్తిగా రహదారులను బ్లాక్ చేశారు. ట్రక్ డ్రైవర్లు చేసిన ఉద్యమం తీవ్రతరం కావడం తో ఏకంగా కెనడా అధ్యక్షుడు రహస్య ప్రాంతం లోకి వెళ్లి పోవాల్సినా పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి సమయం లో ట్రక్ డ్రైవర్లు కేవలం ఒక ప్రాంతంలో మాత్రమే ఉద్యమాలు చేపట్టిన తర్వాత కాలం లో 5 ప్రాంతాలకు విస్తరించారు.
ఈ క్రమం లోనే దేశంలో పరిస్థితులు చేయి దాటి పోతున్నాయని భావించిన కేంద్ర ప్రభుత్వం సైన్యాన్ని రంగం లోకి దింపింది. ఈ క్రమం లోనే ఇక సైన్యం అటు ఉద్యమకారులు అందరిని కూడా పరుగులు పెట్టించి మళ్లీ దాడి చేయడం తో ఒక్కసారిగా తమ హక్కుల గురించి ఉద్యమం చేసిన వారు ఉద్యమాన్ని వదిలి పరుగులు పెట్టారు. స్వాతంత్ర సమరయోధులం అంటూ ఉద్యమాలు చేసిన వారు ఒక్కసారిగా సైన్యం రంగంలోకి దిగడంతో అందరూ పారిపోయిన పరిస్థితి కెనడాలో నెలకొంది..