మెగాస్టార్ కోసం కొరటాల సంచలన నిర్ణయం.....??

Mari Sithara
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తేలకెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో కూడా భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ సహా దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. రాబోయే గాంధీ జయంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇకపోతే దీని తరువాత మెగాస్టార్, కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించనున్నారు. మెగాస్టార్ 152వ సినిమాగా తెరకెక్కనున్న ఈ మూవీ, మంచి మెసేజ్ తో అలానే కమర్షియల్ హంగులతో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కెరీర్ పరంగా ఒక్క అపజయం కూడా ఎరుగని కొరటాల శివ, ఈ సినిమాను కూడా మంచి హిట్ చేయాలని సంకల్పించారట. అయితే ఈ సినిమా విషయమై ఆయన ఒక సంచనలన నిర్ణయం తీసుకున్నట్లు నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. అదేమిటంటే, ఈ సినిమా కోసం సంగీత దర్శకుడిగా సైరాకు పని చేసిన అమిత్ త్రివేదిని తీసుకోనున్నారట కొరటాల శివ. 

నిజానికి ఇప్పటివరకు తాను తీసిన సినిమాలన్నిటికీ దేవిశ్రీ ప్రసాద్ నే సంగీత దర్శకుడిగా తీసుకున్న కొరటాల, ఈ సినిమాతో ఆయనను రీప్లేస్ చేయనున్నారట. అయితే అందుకు ఒక కారణం కూడా లేకపోలేదట. దేవికి వరుసగా సినిమాలు ఉన్నాయని, అందు కారణంగా తమ సినిమాకు పని చేసే అవకాశం లేకపోవడం చేతనే కొరటాల కూడా ఆయన స్థానంలో అమిత్ ని తీసుకోనున్నట్లు చెప్తున్నారు. మెగాస్టార్ ఒక సరికొత్త అవతారంలో కనపడనున్న ఈ సినిమా ప్రారంభోత్సవం అతి త్వరలో జరుగనున్నట్లు తెలుస్తోంది. అదే రోజున సినిమా హీరోయిన్, ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు కూడా తెలియనున్నాయట.....!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: