సినీ ఎంట్రీ కి మరో 'అల్లు' సోదరుడు రెడీ!

Chennuru Karthik
మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే 11 మంది వారసులు వచ్చారు. చిరంజీవి పేరు చెప్పుకుని వచ్చిన వాళ్లంతా దాదాపు సక్సెస్ అయ్యారు. ఓ కుటుంబం నుంచి ఇంతమంది రావడం ఏంటి అనే విమర్శలు వచ్చినా ప్రేక్షకులు మాత్రం వాళ్లకు అండగానే ఉన్నారు. అల్లు శిరీష్, కళ్యాణ్ దేవ్ మాత్రమే ఇప్పటికీ గుర్తింపు తెచ్చుకోలేకపోయారు కానీ మిగిలిన వాళ్లంతా తమదైన ముద్ర వేసారు. ఇక త్వరలో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా వస్తున్నాడు. ఈయన ఉప్పెన సినిమాతో వస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు అల్లు ఫ్యామిలీ నుండి మరో నటుడు వస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.



దీనికోసం మంచి కధల వేటలో ప్రస్తుతం గీత ఆర్ట్స్ బ్యానర్ ఉన్నట్టు తెలుస్తోంది. మంచి కదా దొరికితే చాలు, తనకు తానూ మంచి ఆక్టర్ అని ప్రూవ్ చేసుకోడానికి బోబి రెడీ గ ఉన్నట్టు తెలుస్తోంది. తన సోదరుల్లా కాకుండా మంచి ఆక్టర్ అవ్వాలన్నది తన గోల్ అని తెలుస్తోంది.


ఇప్పటి వరకు అల్లు అరవింద్ వారసులుగా అల్లు అర్జున్, శిరీష్ మాత్రమే ఇండస్ట్రీలో ఉన్నారు. ఇక ఇప్పుడు ఈయన పెద్ద కొడుకు బాబీ కూడా సినిమాల్లోకి రావాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఈయన ఎంట్రీకి కూడా రంగం సిద్ధమవుతుందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే దీనికోసం తెరవెనక ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఇన్నాళ్లు బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటున్న ఈయనకు ఇప్పుడు ఉన్నట్లుండి సినిమాల్లోకి ఎందుకు అనిపించిందో తెలియదు కానీ బాబీ మాత్రం నటుడుగా మారాలని చూస్తున్నాడు. 


హీరోగా కాకుండా నటుడిగా ఇండస్ట్రీకి రావాలని చూస్తున్నాడు అల్లు బాబీ. తన వయసుకు తగిన పాత్రలు ఇవ్వాలంటూ దర్శక నిర్మాతలకు ఈయన కోరుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే ఈయన సినిమాల్లోకి రావడం అల్లు అరవింద్‌కు ఇష్టం లేదని ప్రచారం జరుగుతుంది. ఈ మధ్యే రెండో పెళ్లితో వార్తల్లో నిలిచిన బాబీ.. ఇప్పుడు నటుడుగా వస్తే మాత్రం అది కూడా నిజంగా సంచలనమే. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: