సాంకేతిక రంగం అభివృద్ధి చెందిన తరువాత ల్యాండ్ ఫోన్ నుంచి సెల్ ఫోన్ చేతికి వచ్చింది. సెల్ ఫోన్ లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఈ మార్పులు మామూలు మార్పులు కాదు. ఆండ్రాయిడ్ ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటున్నది. ఇక యాప్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది.
ఇంకేముంది.. తమ బుర్రలకు పదును పెట్టి రకరకాల యాప్ లు క్రియేట్ చేస్తున్నారు. ఈ యాప్ లతో డబ్బులు సంపాదిస్తున్నారు. లక్ ఉంటె యాప్ సూపర్ హిట్ అవుతుంది. కోట్లాది డబ్బు సొంతం అవుతుంది. ఈ విధంగా తయారైంది టిక్ టాక్ గేమ్.
యూజర్ ఫ్రెండ్లీగా తయారైన ఈ టిక్ టాక్ కు కోట్లాదిమంది అడిక్ట్ అవుతున్నారు. చదువును పక్కన పెట్టి విద్యార్థులు టిక్ టాక్ గేమ్ షోలు చేస్తూ బిజీ అవుతున్నారు. కొంతమంది ఉద్యోగులు టిక్ టాక్ లు చూసుకుంటూ కూర్చుంటున్నారు. చూసుకుంటూ కూర్చుంటే సరే...
ఓ అడుగు ముందుకు వేసి.. టిక్ టాక్ చేస్తున్నారు. ఉద్యోగాలను పక్కన పెట్టి టిక్ టాక్ చేస్తున్న ఖమ్మం మున్సిపల్ ఉద్యోగులపై మున్సిపల్ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టిక్ టాక్ చేసిన మీడియా ద్వారా బయటకు రావడంతో... 9 మంది ఉగ్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇప్పటికే టిక్ టాక్ షోను బ్యాన్ చేయాలని డిమాండ్ వస్తోంది.